చిలకం మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో జనసేన పార్టీలోకి పలువురు మైనార్టీలు చేరిక

     ధర్మవరం, (జనస్వరం) : జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు నచ్చి జనసేన పార్టీలోకి చిలకం మధుసూదన్ రెడ్డి సమక్షంలో ధర్మవరం పట్టణంలోని 26 వ వార్డ్ యర్రగుంటకు చెందిన మైనారిటీ, వివిధ కులాలకు సంబంధించి 50 కుటుంబాల వారు చేరడం జరిగింది. దేవిశెట్టి విజయకుమార్, నరగోని నరేష్, షేక్ ముజాహిద్, షేక్ అక్బర్, షేక్ షేక్షావలి, షేక్ అజుమ్,షేక్ సాదిక్, సయ్యద్ షేక్ష, ముహిద్, పెన్నబడి అమర్నాథ్, సాకే పార్తు, కాసే అనిల్ కుమార్, ఆచారి వెంకటేష్, కృష్ణ కాంత్, పలమ్ నేటి కిట్టు, వడ్డే సుబ్బరాజు, బోయ గంగాధర్, ఓం ప్రకాష్, గణేష్ మొదలగున వారు పార్టీలోకి చేరడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ పార్టీలోకి చేరిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియచేసుకుంటూ కార్యకర్తల కోసం నిరంతరం అందుబాటులో ఉంటూ ఏ ఆపద వచ్చిన ముందు ఉంటానని హామీ ఇచ్చారు. అలాగే ప్రతి కార్యకర్త సైనికుడిలాగా పనిచేసి జనసేన పార్టీని గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు నిర్మిద్దామని చెప్పి పిలుపునివ్వడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way