Search
Close this search box.
Search
Close this search box.

జగ్గంపేట మండలంలో వైకాపా నుండి జనసేన పార్టీలోకి పలువురి చేరిక

 జగ్గంపేట

     జగ్గంపేట, (జనస్వరం) : మండలంలోని గోవిందపురం గ్రామంలో మంగళవారం వైయస్సార్‌ కాంగ్రెస్ పార్టీ నుండి పలువురు యువకులు జనసేన పార్టీలోకి చేరారు. జనసేన పార్టీ నియోజకవర్గ కన్వీనర్‌ పాటంశెట్టి సురేష్‌ చంద్ర వారిని సాదరంగా ఆహ్వానించి శాలువాలతో సత్కరించారు. వార్డ్‌ మెంబర్‌ గంపాన శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో సుమారు 50 మంది పార్టీలో చేరారు. గ్రామంలో జనసేన జెండా ఆవిష్కరించారు. నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో జనసేన వనసంరక్షణ పేరుతో లక్ష నిమ్మ మొక్కలు పంపిణీ లక్ష్యంగా సూర్యచంద్ర తలపెట్టిన మొక్కల పంపిణీలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇప్పటికీ 77 ,800 మొక్కలు పంపిణీ చేయడం జరిగిందని సూర్యచంద్ర తెలిపారు. నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో వివిధ గ్రామాలలో మొక్కల పంపిణీ కార్యక్రమం స్థానిక జనసైనికులు ఉత్సాహంగా చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో జగ్గంపేట జనసేన మండల అధ్యక్షులు పాలిశెట్టి సతీష్‌, కిర్లంపూడి, గండేపల్లి, గోకవరం మండలాల అధ్యక్షులు పులిసి అయిరాజ్‌, గోన శివరామకృష్ణ ఉంగరాల మణిరత్నంల ఆధ్వర్యంలో గోవింద పురానికి చెందిన తుమ్మల ఫణీంద్ర, స్వామి, మనోజ్‌, సతీష్‌, సమ్మెటప్రసాద్‌, కొల్లి వీరబాబు, పలు కుటుంబాల సమేతంగా జనసేనలో చేరారు. నియోజకవర్గ నాయకులు గుత్తుల గంగాధర్‌, అల్లం శ్రీనివాస్‌, మొగిలి గంగాధర్‌, బీడీల రాజుబాబు, శ్రీను, దుర్గాప్రసాద్‌ ఆదినారాయణ పలువురు నాయకులు, కార్యకర్తలు  తదితురులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way