Search
Close this search box.
Search
Close this search box.

జనసేన కార్యాలయంలో కమిటీ సభ్యులతో సమావేశం అయిన మంగళగిరి ఇంచార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు

   మంగళగిరి ( జనస్వరం ) : పార్టీ మంగళగిరి నియోజకవర్గ కార్యాలయంలో నియోజకవర్గస్థాయిలో మంగళగిరి ఇంచార్జ్  చిల్లపల్లి శ్రీనివాసరావు అధ్యక్షతన MTMC కమిటీ, మంగళగిరి, తాడేపల్లి, దుగ్గిరాల మండల కమిటీ సభ్యులందరితో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో గ్రామ మరియు బూత్ కమిటీలు ఏర్పాటు గురించి చర్చించారు. నియోజవర్గ స్థాయిలో పార్టీనీ ఏ విధంగా బలపరచాలి. మంగళగిరి నియోజకవర్గంలో జనసేన పార్టీ చేయబోయే మరియు జరగబోయే కార్యక్రమాలపై చర్చ జరిపారు. కార్యకర్తలకు శిక్షణ తరగతులు ఏర్పాటుపై చర్చ చేశారు. సోషల్ మీడియా సభ్యులకి అవగాహన తరగతులు,  గ్రామాల్లో ఉన్న సమస్యలపై చర్చించారు. ఈ సమావేశానికి MTMC అధ్యక్షులు మునగపాటి వెంకట మారుతీరావు, మంగళగిరి మండల అధ్యక్షులు వాసా శ్రీనివాసరావు, తాడేపల్లి మండల అధ్యక్షులు సామల నాగేశ్వరరావు(SNR), దుగ్గిరాల మండల అధ్యక్షులు పసుపులేటి శ్రీనివాసరావు, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి బేతపూడి విజయ్ శేఖర్, గుంటూరు జిల్లా సంయుక్త కార్యదర్శి బడే కోమలి, మంగళగిరి నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు దాసరి శివ నాగేంద్రం, జనసేన పార్టీ రాష్ట్ర చేనేత వికాస విభాగం కార్యదర్శి జంజనం వెంకట సాంబశివరావు (JSR), MTMC కమిటీ, మంగళగిరి, తాడేపల్లి, దుగ్గిరాల మండల కమిటీ సభ్యులు, మంగళగిరి నియోజకవర్గ సోషల్ మీడియా కోఆర్డినేటర్లు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way