
సందీప్ పంచకర్ల ఆధ్వర్యంలో ‘మన జనసేన- మన కుటుంబం’ సన్నాహక మీటింగ్
ఈరోజు భారీ వర్షం పడుతున్నా కూడా స్థానిక కుటుంబాలను జనసేన తో మమేకం చేసే కార్యక్రమం ‘మన జనసేన- మన కుటుంబం’ సన్నాహక మీటింగ్ కు హాజరైన 7వ వార్డు ముఖ్య నాయకులకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు. ఇదే ధృడ నిశ్చయంతో ముందుకు సాగుదాం, భీమిలిలో జనసేన జండా రెపరెపలాడెలా చేద్దాం అని భీమిలి ఇంచార్జ్ డా. సందీప్ పంచకర్ల అన్నారు. అలాగే ఆయన మాట్లాడుతూ రాజకీయం డబ్బుతో ముడిపడిన వ్యవస్థ అని రాజకీయలవైపు కన్నెత్తి చూడలంటేనే భయపడేవారిని సైతం ఎంతో మంది యువకులకు ఆవకాశం కల్పించిన పార్టీ జనసేన అని అన్నారు. గ్రామాలు అభివృద్ధి చెందాలంటే యువతలో ప్రశ్నించేతత్వం రావాలని అప్పుడే అవినీతి జరగకుండా పారదర్శకంగా అభివృద్ది పనులు సక్రమంగా జరుగుతాయని తెలిపారు. నేటి వ్యవస్థ మార్పుకోసం జరుగుతున్న ఉద్యమాల్లో యువతరమే సింహాభాగంగా సాగుతుందని భావి భారత నిర్మాణం యువత చేతుల్లోనే ఉందని గుర్తుచేశారు. దేశానికి యువత ప్రధాన సంపద బలమైన ఆయుధం లాంటి వారని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అని అన్నారు. నియోజకవర్గంలో ఎవరికి ఏ సమస్య వచ్చినా ముందుగా స్పందించి పరిష్కారం చెప్పేది ఒక్క జనసేన మాత్రమే అని ఆయన అన్నారు. పార్టీలతో, కులాలతో మతాలతో సంబంధం లేకుండా అందరికి సమన్యాయం చేసేది ఒక్క జనసేన మాత్రమే అని చెప్పారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు, 7 వార్డు జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు.