Search
Close this search box.
Search
Close this search box.

మన ఇల్లు – మన జనసేన కార్యక్రమం నిర్వహించిన రోసనూరు సోమశేఖర్

రోసనూరు సోమశేఖర్

        సూళ్లూరుపేట ( జనస్వరం ) : దొరవారి సత్రం మండలం ఏకొల్లు పంచాయితీ పాలెంపాడు గ్రామం మరియు వెనుంబాక పంచాయితీ ఆదివాసీ కాలనీలో సుమారు 220 పైగా కుటుంబాలను సూళ్లూరుపేట నియోజకవర్గ జనసేన యువనేత రోసనూరు సోమశేఖర్ సందర్శించారు. స్థానిక జనసైనికుల ఆధ్వర్యంలో మన ఇల్లు – మన జనసేన కార్యక్రమంలో భాగంగా ప్రతి కుటుంబాన్ని కలుస్తూ, స్థానిక సమస్యలు ప్రజలను నేరుగా అడిగారు.  రోడ్లు, నీళ్ళు, కరెంట్ సమస్యలను పరిష్కరించండి వెంటనే అని మమ్మల్ని అడిగారు. ఖచ్చితంగా మండల అధికారులతో మాట్లాడుతామని పరిష్కార దిశగా చర్చిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అలానే పాలనలో మార్పు తీసుకురావాలి అన్న కోణంలో జనసేన పార్టీ గాజు గ్లాసు గుర్తుపై ఓట్లు వేసి 2024 లో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్_కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిని చేయవలసిందిగా ప్రజలను కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో DV సత్రం మండల జనసేన పార్టీ ఉపాధ్యక్షుడు యల్లంపాటి రిషి, ప్రధాన కార్యదర్శి మణి, చరణ్ సాయి, శ్రీను మరియు స్థానిక జనసైనికులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way