క్రియాశీలక సభ్యత్వం నమోదు అవగాహన కార్యక్రమం చేపట్టిన మాకినీడి శేషకుమారి
పిఠాపురం నియోజవర్గం నాయకులతో శ్రీమతి మాకినీడు శేషు కుమారి గారు జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి సూచనల మేరకు పిఠాపురం నియోజకవర్గ౦లో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. ముందుగా మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా మహాత్ముడికి పూలమాలతో నివాళి అర్పించారు. గ్రౌండ్ స్థాయిలో జన సైనికులకు నాయకులకు అండగా ఉండి పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తానని అన్నారు. క్రియాశీలక సభ్యత్వం అనేది ప్రతి గ్రామంలోని జన సైనికుడు పార్టీ కోసం కష్ట పడ్డా ప్రతి ఒక్కరికీ న్యాయం జరుగుతుందని అలాగే త్వరలో మండల కమిటీలు గ్రామ కమిటీలు మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ప్రకటించారని చెప్పారు. కార్యక్రమంలో మన కోలా ప్రసాద్, గాది గోపి, మర్రి దొరబాబు, బండి ఏసుబాబు, ఊట నానిబాబు, గొల్లపల్లి వీరబాబు, మొయ్యల్ల నాగబాబు, పిల్ల దినేష్, కేతినేటి నాగలక్ష్మి, v.అమ్మాజీ, వెంకట్ లక్ష్మి, నియోజవర్గ జనసేన నాయకులు జడ్పిటిసి అభ్యర్థులు ఎంపిటిసి అభ్యర్థులు వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు.