యువశక్తి విజయవంతం చేయండి : జనసేన పార్టీ PAC సభ్యులు ముత్తా శశిధర్

యువశక్తి

        రాజాం ( జనస్వరం ) : నియోజకవర్గం జనసేన నాయకులు ఉర్లాపు పోలరాజు(యు.పి.రాజు) ఆధ్వర్యంలో స్థానిక నియోజకవర్గ కార్యాలయం నందు మీడియా సమావేశం నిర్వహించారు అనంతరం ముఖ్య నాయకులు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.ఈ కార్యక్రమం లో ముఖ్య అతిధిగా పాల్గొన్న జనసేన పార్టీ PAC సభ్యులు ముత్తా శశిధర్ మాట్లాడుతూ ఉత్తరాంధ్రలో ఉన్న అనేక రకాలుగా నష్టపోయిన యువతకు భరోసాని ఇవ్వడానికే జనవరి 12వ తేదీన యువశక్తి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.సామాన్య యువతీ యువకులు వేదిక నుంచి మాట్లాడేందుకు పవన్ కళ్యాణ్ గారు అవకాశం కల్పించారని యువశక్తి లో మీ గళం వినిపించాలని యువత అందరూ ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొని యువత యొక్క సమస్యలను పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకువెళ్లాలని సూచించారు. రాజాం నియోజకవర్గం నాయకులు ఉర్లాపు పోలరాజు (యు.పి.రాజు) మాట్లాడుతూ జనసేన నాయకులు కార్యకర్తలు వీరమహిళలు పెద్ద ఎత్తున యువత ప్రతి ఒక్కరూ ఈ యువశక్తి కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలనీ అన్నారు. ఈ కార్యక్రమంలో ముత్తా శశిధర్ తో పాటు రాష్ట్ర సెక్రటరీ వాసిరెడ్డి శివప్రసాద్ మరియు రాజాం నియోజకవర్గం నాలుగు మండలాల నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way