Logo
Date of Publish : 07 January 2023, 11:34 am
Editor : Sake Naresh

యువశక్తి భారీ బహిరంగ సభను విజయవంతం చేయండి

• ఉత్తరాంధ్ర కోసం పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ కు అండగా ఉత్తరాంధ్ర
• ఉత్తరాంధ్ర అభివృద్ధి సంక్షేమం పవన్ కళ్యాణ్ తోనే సాధ్యం
• ఉత్తరాంధ్ర పై సీఎం జగన్ సన్నిహితులైన విజయ్ సాయి రెడ్డి వైవి సుబ్బారెడ్డిల ఆధిపత్యం పెరిగింది
       విజయవాడ, (జనస్వరం) : యువశక్తి కార్యక్రమ ప్రచారంలో భాగంగా మొదటి రోజు 50 వ డివిజన్లో దాసాంజనేయ స్వామి గుడి లో పూజలు నిర్వహించిన అనంతరం స్థానిక డివిజన్ అధ్యక్షులు రెడ్డిపల్లి గంగాధర్, 55వ డివిజన్ అధ్యక్షులు సోమీ గోవిందుల ఆధ్వర్యంలో ఇంటింటికి యువశక్తి కార్యక్రమాన్ని దాసాంజనేయ స్వామి వీధి, అబ్దుల్ ఖాదర్ వీధి, జాడ పాపయ్య వీధి, పొట్టి శ్రీరాములు ఇంజనీరింగ్ కళాశాల ప్రాంతలలో ఇంటింటికి ప్రచారాన్ని నగర అధ్యక్షులు పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జ్ రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ నిర్వహించారు. ప్రచారంలో భాగంగా ప్రజలు అనేక సమస్యలను మహేష్ వద్ద ప్రస్తావించి ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న అన్యాయం పై వాపోయారు. గతంలో 700 రూపాయలు చెల్లించే ఇంటికి పన్ను నేడు 13వేల రూపాయలు అయ్యిందని, చెత్త పన్ను చెల్లించకపోతే పథకాలు రద్దు చేస్తామని వాలంటీర్లు బెదిరిస్తున్నారని, నిత్యవసర సరుకులు కొనుక్కునే పరిస్థితుల్లో లేమని జగన్ పోతే తప్పించి మంచి రోజులు రావని మహిళలు తెలియజేశారు. పథకాల వల్ల బిచ్చగాళ్లగా మారుతున్నమని సొంతగా నిలబడలేకపోతున్నామని పథకాల వల్ల ఉపయోగం లేదని, ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు కావాలని జగన్మోహన్ రెడ్డి పాలనలో పెట్టుబడులు పరిశ్రమలు రాష్ట్రం నుంచి తరలి వెళ్ళిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ప్రజా సమస్యల పరిష్కారం కోసం 2019 తర్వాత విస్తృతంగా కృషి చేస్తున్నారని, అనేక ప్రాంతాలు పర్యటిస్తున్నారని ఉత్తరాంధ్రలో ఈనెల 12 నిర్వహించే యువశక్తి కార్యక్రమంలో పెద్ద ఎత్తున యువత పాల్గొని విజయవంతం చేయాలని, ఉత్తరాంధ్ర కోసం పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ కు అండగా ఉత్తరాంధ్ర అని, ఆ ప్రాంత ప్రజలు నినాదిస్తున్నారని పవన్ కళ్యాణ్ 2019 కి ముందు నుంచి ఉత్తరాంధ్ర సమస్యలపై పోరాడారని ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యలపై పోరాడారని, గంగపూజ ఆచరించి గంగపుత్రుల సమస్యలపై గళం ఎత్తిరని, హుద్ హుద్ తుఫాన్ బాధితులకు అండగా నిలిచి అనేక సేవా కార్యక్రమాలు చేయడంతో పాటు రూ.50 లక్షలు విరాళం అందించారని ఎన్నికల తదుపరి ఇసుక విధానం మార్చాలని భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం లాంగ్ మార్చి నిర్వహించారని, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయవద్దని భారీ బహిరంగ సభ నిర్వహించారని, ఇది ఆంధ్ర ప్రజల ఆత్మ గౌరవమని, పోరాడారన్న విషయం ప్రజలు మర్చిపోలేదన్నారు. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉత్తరాంధ్ర సహజ వనరులను కొల్లగొట్టారని ఋషికొండను తవ్వేసారని, దస్పల్ల భూములను జగన్ బంధువులకు దారాదత్తం చేశారని, వందల ఎకరాలను కబ్జా చేయడంతో పాటు ఉత్తరాంధ్ర పై ఇతర ప్రాంతా నేతల అజమాయిషి పెరిగిందని విజయసాయి రెడ్డి, వైవి సుబ్బారెడ్డి ల పెత్తనం పెరిగిందని, స్థానికేతర్ల జోక్యం తగ్గించి ఉత్తరాంధ్ర అభివృద్ధి సంక్షేమం జరగాలన్న వలసలు ఆగాలన్న పవన్ కళ్యాణ్ తోనే సాధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో సయ్యద్ ముబీనా, సాబింకర్ నరేష్, నూనె సోమశేఖర్, పిల్లా. రవి దుర్గాప్రసాద్, మద్దిరాల కనకారావు, కే.శంకర్, అనిత, రాజేంద్ర, రామారావు, మల్లెపు విజయలక్ష్మి, స్టాలిన్ శంకర్, పొట్నూరి శ్రీనివాసరావు, కొరగంజి వెంకటరమణ, వేవిన నాగరాజు, నల్లబిల్లి కనకారావు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com