Search
Close this search box.
Search
Close this search box.

మహేష్ కారు టైరులో గాలి తగ్గిన పరుగులు పెట్టిస్తాం

– జనసేన పార్టీ రాష్ట్ర బీసీ నాయకులు, న్యాయవాది ఎం హనుమాన్, 37 డివిజన్ అధ్యక్షులు సిగనం శెట్టి రామగుప్త, బీసీ నాయకులు జాగు సూరిబాబు, జనసేన పార్టీ నాయకులు బండి శ్రీనివాస్
         విజయవాడ, (జనస్వరం) : జనసేన పార్టీ పశ్చిమ కార్యాలయం దగ్గర బ్యానర్లు తొలగించడం ఎంతవరకు న్యాయమని మేము ప్రశ్నిస్తున్నామని జనసేన పార్టీ రాష్ట్ర బీసీ నాయకులు మరియు న్యాయవాది ఎం హనుమాన్, 37 డివిజన్ అధ్యక్షులు సిగనం శెట్టి రామగుప్త, బీసీ నాయకులు జాగు సూరిబాబు, జనసేన పార్టీ నాయకులు బండి శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోతిన మహేష్ ఆఫీస్ దగ్గర ఆదివారం అర్ధరాత్రి 20 మంది మున్సిపల్ సిబ్బంది 100 పైగా పోలీసులు వచ్చి బ్యానర్లు తొలగించడం కరెక్ట్ కాదని, వైసీపీ ఒక రౌడీ పార్టీ అని తెలియజేశారు. వీఎంసీ అధికారులకు అక్రమంగా కట్టే నిర్మాణాలు తొలగించిన ధైర్యం దమ్ము లేదు, వెల్లంపల్లి శ్రీనివాస్ చేసే చిల్లర రాజకీయాలు పోలీసులు, అధికారులు పూర్తి మద్దతుతో వాళ్లకు పని చేస్తున్నారని అన్నారు. వెల్లంపల్లి శ్రీనివాస్ కి ఓటమి ఖరారు అయిందని, దానికి నిదర్శనమే ఈ సంఘటన అని, ఇలాంటి చిల్లర రాజకీయాలు ఎక్కడన్నా చెయ్ గాని పోతిన మహేష్ మీద చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. 2024లో ఎమ్మెల్యే కాబోతున్న పోతిన మహేష్ మీద నీ నీచమైన రాజకీయం చేస్తే ఇంకా సహించేది లేదని వారు అన్నారు. పోతిన మహేష్ కార్ టైర్లు గాలి తగిన ఇంటికి వచ్చి కొడతామని జనసేన పార్టీ తరఫున హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way