విశాఖపట్నం 62వార్డులో ఘనంగా మహాత్మాగాంధీ, లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి వేడుకలు

విశాఖపట్నం 62వార్డులో ఘనంగా మహాత్మాగాంధీ, లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి వేడుకలు

                ఈ రోజు పశ్చిమ నియోజకవర్గం 62వార్డు అల్లూరి సీతారామరాజు కాలనిలో 151వ మహాత్మాగాంధీ జయంతి, 116వ లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి ఉత్సవాలను బిజెపి 62వార్డు బిజెపి, జనసేన ఉమ్మడి అభ్యర్థి శ్రీ ములకలపల్లి ప్రకాష్ గారు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జనసేన పశ్చిమ నియోజకవర్గం ఇంచార్జ్ శ్రీ పీలా రామకృష్ణ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్వచ్ఛ్ భారత్ లో భాగంగా, ముందుగా మహాత్మాగాంధీ విగ్రహానికి, తర్వాత అంబేద్కర్, అల్లూరి సీతారామరాజు విగ్రహాలకు పులమాలలును వేసి నివాళులు అర్పించారు. అనంతరం శ్రీ రామకృష్ణ గారు మాట్లాడుతూ నాడు మహాత్మాగాంధీ గారు, స్వచ్ఛ్ భారత్ పిలుపునిస్తే, లాల్ బాహుదూర్ శాస్త్రి గారు, జై జవాన్, జై కిసాన్ అని పిలుపునిచ్చారు. మన ప్రియతమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ గారు, ఆ నినాదాలను సజీవమైన కార్యరూపంగా దేశప్రజలకు పరిచయం చేశారు. అలాగే జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్ అనే స్ఫూర్తిని భారతదేశ యువత గుండెల్లో దేశభక్తి నింపారు, అని శ్రీ ములకలపల్లి ప్రకాష్ గారు అన్నారు. ఈ కార్యక్రమంలో 40,60,61వార్డుల జనసేన, బిజెపి కార్పోరేటర్ అభ్యర్థులు శ్రీ కె.శివశంకర్ గారు, శ్రీ మొజ్జడ చంద్రమౌలీ గారు, శ్రీమతి నోట్ల చంద్రకళ గారు ఆత్మీయ అతిధులుగా బిజెపి నాయుకులు, కార్యకర్తలు శ్రీ యల్లబిల్లి వెంకట్రావు, శ్రీ పి.అభినయ్, శ్రీమతి కె.వసుంధరా, శ్రీ ఎం. నూకరాజు, జనసేన నాయుకులు శ్రీ ఇంద్రజిత్, శ్రీ శ్రీకాంత్, శ్రీ నగేష్, శ్రీ తారకేశ్, శ్రీ సంతోష్, శ్రీ సత్తిబాబు, శ్రీ అప్పారావు, శ్రీ రమేష్, శ్రీ రాజు, శ్రీ శంకర్ తో పాటు బిజెపి , జనసేన కార్యకర్తలు పాల్గొని “స్వచ్ఛ్ భారత్ ప్రమాణం” అందరు చేశారు.