Logo
Date of Publish : 20 March 2022, 11:48 am
Editor : Sake Naresh

మాడుగుల : ఎన్నికలు ఎప్పుడొచ్చినా జనసేన సిద్ధం! అధినేత పవన్ కళ్యాణ్ కి పాలాభిషేకం

             విశాఖపట్నం ( జనస్వరం ) : మాడుగుల నియోజకవర్గం, చీడికాడ జనసేనపార్టీ కార్యాలయంలో జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో జనసేన నాయకులు మాట్లాడుతూ ఈనెల 14వ తారీఖున జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభలో అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు షణ్ముఖ వ్యూహం అనే 6 హామీలను ప్రవేశపెట్టడం జరిగింది. ఈ హామీలు అన్ని వర్గాల వారిని సంతృప్తిపరుస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పధంలో నడిపించే విధంగా ఉన్నాయని అన్నారు. సామాన్య జనాలకు ఇసుక ఉచితం చేయడం ద్వారా ప్రతీ ఒక్కరి సొంత ఇంటి కలను నిజం చేసేలా ఉందని తెలిపారు. జనసైనికులు అందరూ ఈరోజు నుంచి మొదలుకొని షణ్ముఖ వ్యూహంలో ఉన్న 6 హామీలను ప్రతి గడపకు చేరే విధంగా కార్యక్రమాలు చేపట్టాలని, హామీలతో పాటుగా అధికార పార్టీ యొక్క వైఫల్యాలను కూడా ప్రతి ఒక్కరికీ వివరించాలని మాడుగుల నియోజకవర్గ జనసైనికులు అందరూ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా జనసేన సిద్ధంగా ఉందని తెలియజేశారు. సామాన్యుల కోసం, రైతుల కోసం, నిరుద్యోగులు, ఉద్యోగులు కోసం అలోచించి ఇలాంటి హామీలను ప్రకటించిన అధినేత పవన్ కళ్యాణ్ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాడుగుల నియోజకవర్గం నాలుగు మండలాల జనసైనికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com