చిరు బట్టల వ్యాపారస్తుల కష్టాలను తెలుసుకున్న మధుసూదన్ రెడ్డి

     ధర్మవరం ( జనస్వరం ) : ధర్మవరం పట్టణంలో కార్పొరేట్ సంస్థ అయినా మాంగళ్య సిల్క్స్ ఓపెన్ అయ్యాక ధర్మవరంలో చిరు బట్టల వ్యాపారస్తులు, గార్మెంట్ వ్యాపారస్తుల షాప్ దగ్గరకు జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి విచ్చేసి వారు పడుతున్న కష్టాలను అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో ప్రతి ఒక్కరి నోట ఈ మాంగళ్య షాపు వచ్చినప్పటి నుంచి మాకు కనీసం భోని కూడా అవ్వట్లేదని లక్షల్లో అప్పులు చేసి మరి పెట్టుబడి పెట్టి చేస్తున్న కూడా జరగట్లేదని వాపోయారు. ఇలా అయితే మేము బాడుగలు ఎలా కట్టుకొవాలి, పనిచేసే వాళ్ళకి ఎలా జీతాలు ఇవ్వాలని కన్నీటి పర్యవంతమయ్యారు. తప్పకుండా వారిని ఆదుకుంటామని మళ్లీ వచ్చే దసరా లోపల మాంగళ్య షాపును తీసివేపిచ్చే బాధ్యతను తీసుకుంటానని, అదేవిధంగా ఇంతమంది ఉసురు స్థానిక ఎమ్మెల్యే కేతిరెడ్డికి తగలకుండాపోదని తెలియజేసి మాంగళ్య షాపును అధికార పార్టీ వాళ్ళే ఏర్పాటు చేయించి దాన్ని వాళ్ళే ఓపెనింగ్ చేయడం హేయమైన చర్యని ముక్తకంఠంతో ఖండించడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way