Search
Close this search box.
Search
Close this search box.

మదనపల్లె జనసేన ఆధ్వర్య౦లో మెగా వైద్యశిబిరం

మదనపల్లె

   మదనపల్లె ( జనస్వరం ) : జనసేన నాయకులు శ్రీరామ రామాంజనేయులు గారి ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి చెన్నై నుంచి వైద్యులు హాజరై అన్ని రకాల విభాగాలు వైద్య పరీక్షలు పెద్ద పరీక్షలు మరియు ఉచిత మందుల పంపిణీ చేయడం జరిగింది. ఉదయం పదిగంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నిర్విరామంగా కొనసాగిన ఈ కార్యక్రమంలో సుమారు 500 మంది దాకా రోగులు పాల్గొని తమ కు అవసరమైన వైద్య సహాయాన్ని మరియు మందులను పొందారు. ఈ కార్యక్రమంలో మదనపల్లి జనసేన నాయకులు శ్రీరామ రామాంజనేయులు మరియు ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన జనరల్ సెక్రెటరీ దారం అనిత దారం హరిప్రసాద్, నళిని,  శిల్పాఆకుల, శంకర చంద్రశేఖర్ పాల్గుణ, సుప్రీం హర్ష, సోను, అనిల్, CTM గ్రామానికి చెందిన గంగాధర్, చిన్న రెడ్డి రవికుమార్ బబ్లు రామ్మూర్తి తెలుగుదేశం నాయకుడు కోసూరు వేమన్న తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way