అంగన్వాడీల వర్కర్ల 61వ రోజు సమ్మెకు లోకం మాధవి మద్దతు

     నెల్లిమర్ల ( జనస్వరం ) : అంగన్వాడీ వర్కర్లు నాలుగేళ్లగా తీరని సమస్యలపై గత 61 రోజులుగా చేస్తున్న నిరవధిక సమ్మెకు మద్దతుగా నెల్లిమర్ల నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీమతి లోకం మాధవి గారు ఈరోజు భోగాపురం ఎమ్మార్వో ఆఫీస్ దగ్గర అంగన్వాడీ వర్కర్ల తో మాట్లాడి ప్రస్తుత ప్రభుత్వం అంగన్వాడీలపై ప్రయోగించిన ఎస్మా చట్టం ద్వారా ఏ విధంగా ఇబ్బంది పెడుతుందో తెలుసుకున్నారు. అదేవిధంగా మద్దతు తెలపడమే కాకుండా అంగన్వాడి వర్కర్ల సమ్మె పోరాట నిధికి తన వంతు సహకారం కూడా అందజేయడం జరిగింది. లోకం మాధవి గారు మాట్లాడుతూ గత 60 రోజులుగా గ్రామాలలో ఎంతో అవసరమైన అంగన్వాడీ మహిళలుకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, పనికి తగిన పరిహారం అందజేయకుండా ప్రస్తుత ప్రభుత్వం బెదిరింపు చర్యలు పాల్పడడం సరైనది కాదని తెలిపారు. అంగన్వాడీలు చేస్తున్న న్యాయపోరాటానికి జనసేన పార్టీ మద్దతుగా ఉంటదని కూడా తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల సీనియర్ నాయకులు జనసైనికులు వీర మహిళలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way