Search
Close this search box.
Search
Close this search box.

దేవరదిబ్బకు తాగునీరు అందించాలని స్థానిక జనసేన నాయకుల డిమాండ్

తాగునీరు

          పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం, ముత్తుకూరు మండల పరిధిలోని దేవరదిబ్బ గ్రామంలో 200కు పైగా గిరిజన కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. ఆ గ్రామానికి ఆనుకుని ఉన్న భూముల్లో స్థానిక పవర్ ప్లాంట్ యాజమాన్యం యాష్ పాండ్ నిర్మించింది. అప్పట్లో బూడిద వల్ల సమస్యలు తెలెత్తకుండా వేరే ప్రాంతంలో ఇళ్లు నిర్మించి ఇస్తామని దెవరదిబ్బ గ్రామస్థులకు హామీ ఇచ్చారు. ఇళ్ల సంగతి అటుంచితే పవర్ ప్లాంట్ విడుదల చేసే బూడిదతో గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనీసం వారికి తాగునీరు కూడా అందుబాటులో లేని పరిస్థితి. స్థానిక జనసేన నాయకులు శ్రీ బొబ్బేపల్లి సురేష్ బాబు పర్యటన సందర్భంగా గ్రామస్థులు తమ సమస్యలను వెళ్లబోసుకున్నారు. అధికార పార్టీ మద్దతుతో గెలుపొందిన గ్రామ సర్పంచ్ దృష్టికి సమస్యను తీసుకువెళ్లగా వారి నుంచి స్పందన కరువయ్యింది. దీంతో తక్షణం వారికి ట్యాంకర్లతో మంచినీటి సరఫరాకు ఏర్పాటు చేయడంతో పాటు సమస్య శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకువస్తామని శ్రీ సురేష్ బాబు హామీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way