Search
Close this search box.
Search
Close this search box.

అంబేద్కర్ గారి విగ్రహానికి వినతిపత్రం అందించిన లింగపాలెం జనసైనికులు

అంబేద్కర్

          ఏలూరు ( జనస్వరం ) : విశాఖలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిపై అనుచితంగా వ్యవహరించిన వైసీపీ ప్రభుత్వం విధానానికి నిరసనగా లింగపాలెం మండలం జనసేన పార్టీ ఆధ్వర్యంలో మండలంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి వినతి పత్రం అందించడం జరిగింది.. ఈ సందర్భంగా లింగపాలెం మండల అధ్యక్షుడు పంది మహేష్ బాబు మాట్లాడుతూ జనసేన నాయకులపై అక్రమ కేసులు బనాయించడం, వారిపై దాడులు, అరెస్టులు చేయడం, పోలీసుల చేత పవన్ కళ్యాణ్ గారిని అణచివేయాలని చూస్తే రాష్ట్రంలోని కార్యకర్తలు తిరుగుబడతారని హెచ్చరించారు.. కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు, మాదాసు కృష్ణ, ఉపాధ్యక్షులు తాళం మల్లేశ్వర రావు, కార్యదర్శులు పంది సతీష్ కుమార్, పొదిల మహేష్, బంటు సామ్యూల్, పఠాన్ సుభాని మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way