Search
Close this search box.
Search
Close this search box.

నిద్రపోతున్నటువంటి వైసీపీ ప్రభుత్వాన్ని నిద్రలేపుదాం : జనసేన నాయకులు అంకిపల్లె అఖిల్

వైసీపీ

        రైల్వే కోడూరు ( జనస్వరం ) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అద్వానంగా తయారైన రహదార్ల పట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రదర్శిస్తున్న నిర్లక్ష్యం ధోరణిని వ్యతిరేకిస్తూ జనసేన పార్టీ ఆదేశాల మేరకు, నిద్ర మత్తులో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిద్ర లేపాలని పిలుపునిచ్చారు. #GoodMorningCmsir అనే ట్యాగ్ తో మొద్దు నిద్రలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని నిద్ర లేపడం కోసం ఈనెల15,16,17 తేదీల్లోంలో ఉండే ప్రతి నియోజకవర్గ మండల పంచాయతీలలో ఉన్నటువంటి రోడ్ల పరిస్థితిని ప్రభుత్వానికి తెలియజేయాలని జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు మరియు PAC చైర్మన్ నాందేళ్ళ మనోహర్ గారు పిలుపుని ఇవ్వడం జరిగింది. ఈ మేరకు రైల్వే కోడూరు జనసేన పార్టీ నాయకులకు అంకిపల్లె అఖిల్ మాట్లాడుతూ జనసేన పార్టీ నాయకులు అంకిపల్లె అఖిల్ మాట్లాడుతూ రైల్వే కోడూరు నియోజకవర్గంలోని హై వే రోడ్ల మీదే కాదు ప్రతి ఊరు, పంచాయితీ ప్రజలకు ఇబ్బంది కలిగించే రోడ్డు దుస్థితి ఏదైనా మీరు ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయండి. #Goodmoring CMsir అని హ్యాష్ టాగ్ తప్పకుండా నోట్ చేసి పోస్ట్ చెయ్యాలని ఈ కార్యక్రమం 15,16,17 తేదీలలో జనసేన ప్రతిష్టాత్మకంగా నిర్వహించనుంది. కావున ప్రజా సంక్షేమాన్ని కాంక్షిస్తూ రైల్వే కోడూరు నియోజవర్గంలోనిని ప్రతీ జనసైనికుడు వీర మహిళా నాయకులు అందరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని జనసేన పార్టీ యువ నాయకులు అంకిపల్లి అఖిల్ కోరారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way