ఈ నియంత పాలన పైన యుద్ధం విజయనగరం జిల్లా నుంచే మొదలుపెడదాం

విజయనగరం

      విజయనగరం ( జనస్వరం ) : పేదలకు పెత్తందార్లుకు మధ్య జరుగుతున్న యుద్ధం అంటూ ఈ జగన్ ప్రభుత్వం చేస్తున్న వింత ప్రచారాన్ని దుయ్యబడుతూ  బాలాజీ జంక్షన్ వద్ద  జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈ పిచ్చ వైసిపి పార్టీ వింత పోకడలను నిరసిస్తూ వినూత్నమైన ప్రదర్శన ద్వారా ధీటైన సమాధానం చెప్పడం జరిగింది. పాపం కసాయి వాడు, రక్త రచన, దౌర్జన్యపు నిర్వహణ, నరహంతక దర్శకత్వం: జగన్ అంటూ వైసిపి వారి ఫ్లెక్సీల పక్కనే మన జనసేన పార్టీ తరపున ఫ్లెక్సీలు పెట్టి, చుట్టూ పెత్తందార్లను పెట్టుకుని రౌడీ రాజకీయం చేస్తున్న జగన్ రెడ్డి అతి పెద్ద పెత్తందారి అని, 2024 లో జగన్ & పెత్తందార్లకు పేదల తరపున నిలబడి పోరాడుతున్న జనసేన పార్టీ మధ్యనే ప్రధాన ఎన్నికల యుద్ధం జరగబోతుందని అన్నారు. పవన్ కళ్యాణ్ గారికి అత్యధిక సీట్లిచ్చి ప్రజలే గెలవనున్నారని ప్రెస్ మీట్ ద్వారా తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మర్రాపు సురేష్, జనసేన రాష్ట్ర కార్యక్రమాల నిర్వహణ కార్యదర్శి బాబు పాలూరు, మిడతాన రవి కుమార్, ఆదాడ మోహన్, మండల అధ్యక్షులు సంచాన గంగాధర్, అప్పారావు, మరడాన రవి, రమేష్ రాజు, చక్రధర్ నాయకులు ఆదినారాయణ, కలిగి అప్పారావు, శ్రీను తదితర జనసైనికులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way