ఈతకోట గ్రామంలో గళ్ళ సత్యనారాయణ కుటుంబానికి 1,00,000 రూపాయల బాండు అందించిన కొత్తపేట జనసేన నాయకులు

    ఈతకోట, (జనస్వరం) : రావులపాలెం మండలం ఈతకోట గ్రామంలో ఇటీవలే అనారోగ్యంతో గళ్ళ సత్యనారాయణ (పండు) చిన్న వయసులోనే చనిపోవడం జరిగింది. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబంతో, ఇద్దరు చిన్నపిల్లలుతో ఇబ్బంది పడుతున్నారు. గ్రామంలోని జనసేనపార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు అందరూ కలిసి 1,14,500 రూపాయలు సమకూర్చి లక్ష రూపాయల పిల్లలు పేరు మీద బ్యాంక్ లో ఫిక్సిడ్ డిపాజిట్ చేసిన బాండును ఆ కుటుంబానికి కొత్తపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇంఛార్జ్ బండారు శ్రీనివాస్ ఆధ్వర్యంలో అందించారు. 14,500 రూపాయలు నగదు రూపంలో అవసరాలకు అందజేసారు. జనసేన పార్టీ వారికి అండగా ఉంటుంది అని బండారు శ్రీనివాస్ ధైర్యం చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామపార్టీ అధ్యక్షులు యర్రంశెట్టి రాము, జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్ల డేవిడ్, జిల్లా కార్యదర్శలు దొంగా సుబ్బారావు (DVS), బొక్కా ఆదినారాయణ, మండల‌ అధ్యక్షులు తోట స్వామి, రాచకొండ శ్రీనివాస్, MPTC బొరుసు సీతారత్నం, జువ్వ యేసు, మోటురి సత్య, నంబు ప్రసాద్, బొక్కా శ్రీను తదితర మండల, గ్రామ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way