Search
Close this search box.
Search
Close this search box.

జనసేన పార్టీ అధికారంలోకి రావాలని విజయసంకల్ప పాదయాత్ర ప్రారంభించిన ధర్మవరం జనసేన నాయకులు

ధర్మవరం

         ధర్మవరం ( జనస్వరం ) : వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవ్వాలని,చిలకం మధుసూదన రెడ్డి ధర్మవరం ఎమ్మెల్యే కావాలని ధర్మవరం జనసేన పార్టీ నాయకులు కేలవత్ నాయుడు గారి ఆధ్వర్యంలో లక్ష్మీనారాయణ (చిన్న), కడపల సుధాకర్ రెడ్డి, ధారా గంగాధర్, గొంగటి హరి, వెంకటేష్ నాయక్, నారాయణస్వామి నాయక్, మాలేపాటి శ్రీరామ్ వీరందరూ పట్టణంలోని పలు ఆలయాలలో పూజా కార్యక్రమాలు నిర్వహించుకుని ధర్మవరం నుంచి తిరుమలకు కాలినడకతో యాత్ర కొనసాగించడం జరిగింది. మీడియా ముఖంగా నాయుడు నాయక్ మిత్ర బృందం మాట్లాడుతూ ధర్మవరంలో చేనేత వ్యవస్థ అభివృద్ధి చెందాలన్నా అదే విధంగా ధర్మవరంలో పేదరికం పోవాలన్న ముస్లిం మైనారిటీలు బడుగు బలహీన వర్గాల వారు బాగుపడాలన్న రైతుల కష్టాలు తెలిసిన వ్యక్తి రైతుల కష్టాలు పోవాలన్నా స్థానికుడైన మధుసూదన్ రెడ్డి ధర్మవరం ఎమ్మెల్యే కావాలని ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్నటువంటి తిరుమల కు పాదయాత్ర చేస్తున్నామని తెలిపారు. మొదటిరోజు చేస్తున్న యాత్రకు సంఘీభావం తెలిపి కార్యక్రమంలో పాల్గొన్నవారు మత్స్యకార వికాస విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెస్త శ్రీనివాసులు,జిల్లా ప్రధాన కార్యదర్శి దాసరి రామాంజనేయులు,మండల అధ్యక్షులు ధర్మవరం నాగ సుధాకర్ రెడ్డి, పుర్రం శెట్టి రవి, చంద్రబాబు నాయుడు, మరియు జిల్లా సంయుక్త కార్యదర్శి దూది జయ రామాంజనేయులు, గొట్లురు జీవి, పార్టీ వీర మహిళ గొట్లురు శైలజ, బాలకృష్ణ, కార్యనిర్వాహణ కమిటీ సభ్యులు పేరూరు శ్రీనివాసులు, కోటికి రామాంజి, బండ్ల చంద్రశేఖర్, మల్లేమీద మోహన్ నాయుడు, నీలూరు లక్ష్మీనారాయణ, దాము, రామకృష్ణ నాయక్, తలారి ప్రతాప్ మరియు వందలాది మంది కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way