అవినీతి నాయకులకు లీడర్ జగన్ మోహన్ రెడ్డి : రైల్వే కోడూరు జనసేన నాయకులు

      రైల్వే కోడూరు, (జనస్వరం) : రైల్వే కోడూరు నియోజకవర్గం వైసిపి ఎమ్మెల్యే కోరమట్ల శ్రీనివాసులు చేసిన వ్యాఖ్యలను రైల్వేకోడూరు జనసేన వేదికగా ఖండిస్తున్నాము. కొరముట్ల కోడూరులో నిర్వహిస్తున్న గడపగడప కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ ని విమర్శించడం జరిగింది. రైల్వేకోడూరు జనసేన వేదికగా కొరముట్లని రెండు విషయాలు అడగాలని కొరుకుంటున్నామని తెలిపారు. మొదటగా మీ గ్రామం బ్రిడ్జి పూర్తి చేసి మాట్లాడితే బాగుంటుందని ఎమ్మెల్యేకి సలహా ఇస్తున్నాం. రాష్ట్రంలో జగన్ రెడ్డి అధికారంలో వచ్చాక పావలా వంతు కూడా అభివృద్ధి చేయకుండా మెహర్బానీ మాటలు మాట్లాడుతున్న నాయకుడు మీ జగన్ రెడ్డి  అని గుర్తు చేస్తున్నాం.అం దుకే జనసేన తరఫున పావలా జగన్ మోహన్ రెడ్డి అని నామకరణం చేస్తున్నామని తెలిపారు. మీ నాయకుడి బిరుదుని ఎదుటివారికి ఆపదించి మాట్లాడటం మీ మూర్ఖత్వమే అని తెలియజేస్తున్నాం. మీరు ప్రతిపక్షంలో ఉన్నపుడు చంద్రబాబు మీద అవినీతి చక్రవర్తి అని బుక్కు ప్రింట్ చేసి ఒక్క రూపాయి కూడా అవినీతిని నిరూపించలేక జగన్ రెడ్డి చంద్రబాబుతో తమ దొంగ చాటు స్నేహాన్ని జనసేన తరపున గుర్తు చేస్తున్నాం. రాబోయే ఎన్నికల్లో కోడూరులో ఎగిరేది జనసేనపార్టీ ఎమ్మెల్యే జెండా అని ఘంటా పదంగా చెప్తున్నాం. నాలుగు సార్లు కోడూరు ఎమ్మెల్యేగా గెలిచిన కోరమట్ల శ్రీనివాసులు కోడూరు అభివృద్ధికి చేసిన ప్రయత్నం శూన్యం అని ఈ సమావేశం సందర్భంగా ప్రజలందరికీ తెలియజేస్తున్నామని తెలిపారు. రాజంపేటను జిల్లా హెడ్ కోటర్ గా చేసుకొనే పోరాటంలో కొరముట్ల శ్రీనివాసులు నిర్వీర్యం చేసిన ఘనత దక్కించుకున్నారని ఈ సమావేశం సందర్భంగా ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా ఎమ్మెల్యే వాస్తవాలను గుర్తించి పవన్ కళ్యాణ్ మీద అకారణంగా నిందలు వేసే కార్యక్రమానికి స్వస్తి పలకాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో జనసేన సీనియర్ నాయకులు ముత్యాల కిషోర్, మర్రి రెడ్డి ప్రసాద్, ఉత్తరాది శివకుమార్, యద్దల అనంతరాయులు, లింగాల హరి, జనసేన నాయకులు నగిరిపాటి మహేష్, సిరియాల శివకుమార్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way