Search
Close this search box.
Search
Close this search box.

లావేరు మడ్డువలస ఫేజ్ 2 కాలువల పనులను విస్తరణ చేయాలని అధికారులకు జనసైనికుల వినతి

       ఎచ్ఛర్ల నియోజకవర్గం మడ్డువలస ఫేజ్ -2 కాలువల విస్తరణ పనులను లావేరు మండలం కొత్తకుంకాం, పాతకుంకాం, గుర్రాలపాలెం, అదపాక, పెద్దకొత్తపల్లి, బుడుమూరు వరకూ చేపట్టాలని ఆయా గ్రామాలకు చెందిన యువత కోరారు. ఈ మేరకు శ్రీకాకుళంలో కలెక్టర్ నివాస్ కు సోమవారం వినతిపత్రం అందించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ 2015 వరకూ కొంత మేర సాగునీరు వచ్చేదని, ఆ తర్వాత జి సిగడాం మండలం దేవరవలసవద్ద కాలువ పూడికపోవడం వల్ల నీరు రావడం లేదన్నారు. సాగు నీరు వచ్చేలా చర్యలు చేపట్టాలని కోరారు. వినతిపత్రం అందించినవారిలో ఆయా గ్రామాలకు చెందిన జనపాల చంద్రశేఖర్ రావు,బార్నాల. దుర్గరావు, కాకర్ల. బాబాజీ , సీర్ర బాలకృష్ణ, దేవిరెడ్డి వీరబాబు, ముద్దడ సురేష్ ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way