ఖమ్మం ( జనస్వరం ) : తెలంగాణ రాష్ట్రంలో తొలి ప్రయత్నంగా ఖమ్మం జిల్లా కేంద్రం నుండి జనసేన పార్టీ ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇంచార్జ్ రాం తాళ్లూరి ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు " జనంలోకి జనసేన " కార్యక్రమం ప్రారంభించిన స్థానిక జనసేన నాయకులు, వీరమహిళలు. జనసేన నాయకులు మాట్లాడుతూ భవిష్యత్తులో జనసేన పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నామని అన్నారు. రాజకీయం డబ్బుతో ముడిపడిన వ్యవస్థ అని రాజకీయలవైపు కన్నెత్తి చూడలంటేనే భయపడేవారిని సైతం ఎంతో మంది యువకులకు ఆవకాశం కల్పించిన పార్టీ జనసేన అని అన్నారు. గ్రామాలు అభివృద్ధి చెందాలంటే యువతలో ప్రశ్నించేతత్వం రావాలని అప్పుడే అవినీతి జరగకుండా పారదర్శకంగా అభివృద్ది పనులు సక్రమంగా జరుగుతాయని తెలిపారు. నేటి వ్యవస్థ మార్పుకోసం జరుగుతున్న ఉద్యమాల్లో యువతరమే సింహాభాగంగా సాగుతుందని భావి భారత నిర్మాణం యువత చేతుల్లోనే ఉందని గుర్తుచేశారు. దేశానికి యువత ప్రధాన సంపద బలమైన ఆయుధం లాంటి వారని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అని అన్నారు. నియోజకవర్గంలో ఎవరికి ఏ సమస్య వచ్చినా ముందుగా స్పందించి పరిష్కారం చెప్పేది ఒక్క జనసేన మాత్రమే అని ఆయన అన్నారు. పార్టీలతో, కులాలతో మతాలతో సంబంధం లేకుండా అందరికి సమన్యాయం చేసేది ఒక్క జనసేన మాత్రమే అని అన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com