వరద బాధితులని ఆదుకున్న కువైట్ ఎన్నారై జనసేన

         న్యూస్ ( జనస్వరం ) : వరదల్లో సర్వం కోల్పోయి సహాయం కోసం ఎదురుచూస్తున్న వరద బాధితులను ఆదుకోవడం కోసం కువైట్ జనసేన నాయకులు ముందుకు వచ్చారు.  జనసేన నాయకులు నరస రామయ్య వృత్తి రీత్యా కువైట్ లో ఉంటూ వరద బాధితులకు సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. మంగళవారం గురుపేట, పాటూరు మరియు ఎర్రి పాపగారిపల్లిలో లక్ష అయిదు వేల రూపాయలు నిత్యవసర వస్తువులు మరియు ఆర్థిక సహాయం అందించారు.  స్థానిక జనసేన నాయకులు పురం సురేష్ మాట్లాడుతూ రూపాయికి రూపాయికి పోగు వేసుకొని కొనుక్కున్న వస్తువులన్నీ కళ్ళముందే నీటిపాలు అయ్యాయని వారి మాటలు వింటుంటే గుండె బరువెక్కుతోందని బాధితులతో కలిసి మాట్లాడి వారిని ఓదార్చారు.  మనందరి బాధ్యత అని తిమ్మాయిపాలెం జనసేన నాయకులు పురం సురేష్ సింగిరి నరస రామయ్య అన్నారు. సహాకారం అందించిన సుభాష్ చంద్రబోస్, సింగిరి సుబ్రహ్మణ్యం, మోడం చిరంజీవి, మౌలానా, తిమ్మాయపాలెం నరసింహులు, మునిరత్నం, గురేష్, కుప్పయ్య, ఓబులేష్ లకు  ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు  చిట్వేలి జనసేన నాయకులు మాదాస్ నరసింహ, కోడూరు జనసేన నాయకులు ముత్యాల కిషోర్, నందలూరు జనసేన నాయకులు కొట్టే శ్రీహరి రవి, తిమ్మాయిపాలెం జనసైనికులు కరిముల్లా, కార్తీక్, మోహన్, నవీన్, ప్రకాష్ ముత్యాల, అనిల్ గుంటుపల్లి, రాజేష్, సతీష్ మరియు రాజా అల్లావుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.