అనాధకు ఆశ్రయం కల్పించిన మానవతావాది కర్నూలు జిల్లా జనసేనపార్టీ ప్రధాన లీగల్ కార్యదర్శి మధుసూదన్

మధుసూదన్

  ఆళ్లగడ్డ, (జనస్వరం) : మానవత్వానికి పర్యాయపదం సేవా గుణానికి నిజమైన నిర్వచనం ఆపదలో ఉన్న వారికి తక్షణ సాయం అందించడం ఏకైక లక్ష్యంతో నిర్విరామంగా కృషి చేస్తూ అన్ని వర్గాల ప్రజల నుంచి విశేష ప్రశంసలు అందుకుంటున్న సీనియర్ న్యాయవాది జనసేన జిల్లా ప్రధాన లీగల్ కార్యదర్శి దాది రెడ్డి మధుసూదన్ గారు. చాగలమర్రి మండలం ముత్యాలపాడుకు చెందిన నడివీధి రాజమ్మ గత కొన్ని సంవత్సరాల నుండి ముత్యాలపాడు బస్టాండ్ లో అనాధగా ఉండేది. ఆమెకు ఎవరి సహకారం లేకపోవడంతో ఒంటరిగా బస్ స్టాప్ లోనే ఉంటూ జీవనం సాగిస్తూ ఉండేది. ఈ విషయాన్ని గమనించిన చక్రవర్తుల పల్లె గ్రామానికి చెందిన జనసేన నాయకుడు సుబ్బయ్య, దాది రెడ్డి మధుసూదన్ తెలపగా స్పందించిన ఆయన మానవతా దృక్పథంతో ఆళ్లగడ్డ పట్టణంలో సత్య రూరల్ నిరాశ్రయుల వసతి గృహం నిర్వాహకుడు ప్రదీప్ తో సంప్రదించి, ముత్యాలపాడు నుండి తన వాహనంలోనే రాజమ్మ ను వెంట తీసుకొని వచ్చి నిరాశ్రయుల వసతి గృహంలో చేర్పించారు. ఆమెకు సంబంధించి వస్త్రాలు అందజేసి మానవత్వానికి నిర్వచనంగా దాది రెడ్డి మధుసూదన్ నిలిచారు. ఈ సందర్భంగా పలువురు ఆయనను ప్రశంసించారు. అలాగే చక్రవర్తుల పల్లె జనసేన నాయకుడు సుబ్బయ్య, మడ్డీ దిలీప్ కుమార్ ప్రసంగి , ఆదాం, ముత్యాలపాడు గ్రామానికి చెందిన వీరందరినీ గ్రామానికి చెందిన పలువురు అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way