ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం చేసిన కృష్ణా జిల్లా జనసేనపార్టీ నాయకులు

     నందిగామ, (జనస్వరం) : కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం పెండ్యాల గ్రామంలో గత అయిదు రోజుల క్రిందట పంట దిగుబడి లేక అప్పుల బాధ తాళలేక కౌలురైతు జీనేపల్లి జ్వాలా నరసింహారావు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న కృష్ణా జిల్లా జనసేనపార్టీ అధ్యక్షులు బండిరెడ్డి రామకృష్ణ, ఉపాధ్యక్షులు బొలియశెట్టి శ్రీకాంత్ గార్లు అతని    భార్య, పిల్లలను పరామర్శించి వారికి 15000 /- వేల రూపాయలు జనసేనపార్టీ తరుపున తక్షణ సాయం అందించారు. అలాగే వారి కుటుంబానికి జనసేన పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అప్పుల బాధలు తాళలేక ఆత్మహత్యలు చేసుకున్న కౌలురైతుల కుటుంబాలను పరామర్శిస్తూ వారి వారి కుటుంబాలకు లక్ష రూపాయలు చొప్పున అందజేస్తూ వారి పిల్లల భవిష్యత్తుకు పార్టీ నుండి నిధి ఏర్పాటు చేస్తూ ఆదుకుంటున్న జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు రాబోయే ఉమ్మడి కృష్ణా జిల్లా పర్యటనలో భాగంగా నందిగామ నియోజకవర్గంలో కూడా ఈ కుటుంబాన్ని కూడా ఆదుకునే విధంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. రాబోయే జనసేన పార్టీ ప్రభుత్వం లో కౌలు రైతులకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఇప్పటివరకు అధికారులు, ప్రజాప్రతినిధులు ఎవరు నరసింహారావు కుటుంబం వైపు కన్నెత్తి చూడకపోవడం దారుణం. ఇదే నియోజకవర్గంలో గత కొన్ని రోజుల క్రితం ఒక ఉన్నత సామాజిక వర్గానికి చెందిన కౌలు రైతు చనిపోతే మరునాడే పరామర్శకు వెళ్లిన ఎమ్మెల్యే ఒక బిసి కులానికి చెందిన వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటే అయిదు రోజులైనా పరామర్శించలేదని, ప్రజలందరినీ సమదృష్టితో చూడాలని, అగ్రవర్ణ రైతులను ఒక లాగా వెనుకబడిన తరగతులకు చెందిన రైతులను మరొకలాగా దయచేసి చూడవద్దు అని పేర్కొన్నారు. ప్రభుత్వం ద్వారా కౌలు రైతులకు నష్ట పరిహారం అందేలా స్థానిక ఎమ్మెల్యే చూడాలని, ఆయన ఎందుకు స్పందించలేదో తెలియలేదని, దీనిపై వెంటనే స్పందించి కౌలు రైతు కుటుంబానికి న్యాయం చేయాలని బండ్రెడ్డి రామకృష్ణ డిమాండ్ చేశారు. అలాగే తుర్లపాడు గ్రామంలో ఇటీవల అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న మరొక రైతు మాలగాని జాలయ్య కుటుంబాన్ని పరామర్శించిన జనసేన పార్టీ ఉమ్మడి కృష్ణ జిల్లా ఉపాధ్యక్షులు బొలియాశెట్టి శ్రీకాంత్  5000 /- వేల రూపాయలు ఆర్ధిక సాయం అందజేసి వారి కుటుంబానికి జనసేన పార్టీ అండగా ఉంటుందని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కృష్ణాజిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు బండిరెడ్డి రామకృష్ణ, ఉపాధ్యక్షులు బొలియాశెట్టి శ్రీకాంత్, నియోజకవర్గ నాయకుడు పూజారి రాజేష్, కంచికచర్ల మండల పార్టీ అధ్యక్షుడు నాయిని సతీష్, నందిగామ మండల అధ్యక్షులు కుడుపుగంటి రామారావు, చందర్ల పాడు మండల అధ్యక్షులు వడ్డెల్లి సుధాకర్, వీరులపాడు మండల పార్టీ అధ్యక్షుడు బేతపూడి జయరాజు, నందిగామ పట్టణ పార్టీ అధ్యక్షుడు తాటి శివ కృష్ణ, షేక్ పెద్ద బాజీ, కనపర్తి సాయి, తేజ, సూరా సత్యం, నందిగామ 20 వ వార్డు కౌన్సిలర్ తాటి వెంకటకృష్ణ, పొన్నవరం వార్డు మెంబరు పసుపులేటి శ్రీనివాసరావు, జిల్లా కార్యవర్గ సభ్యులు పుట్టా స్వరూప, తోట ఓంకార్, నియోజకవర్గ వీరమహిళా విభాగం నాయకురాలు తోటకూర పద్మావతి ఎం, గోపిశెట్టి నాగలక్ష్మి, చనమాల సౌందర్య, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way