Search
Close this search box.
Search
Close this search box.

దేవాలయాల మధ్య ఉన్న మద్యం దుకాణమును తొలగించాలని MRO గారికి వినతిపత్రం ఇచ్చిన కోవూరు నియోజకవర్గ జనసేన నాయకులు

కోవూరు

    కోవూరు, (జనస్వరం) : నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం పరిధిలోని విడవలూరు మండలం రామతీర్థం గ్రామంలో వెలసి ఉన్న శ్రీ రామలింగేశ్వ స్వామి దేవస్థానం నుంచి భక్తులు సముద్ర స్నానానికి వెళ్లే మార్గంలో ప్రభుత్వ మద్యం దుకాణాన్ని ఏర్పాటు చేయడాన్ని జనసేనపార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు విడవలూరు మండలం జనసేనపార్టీ అధ్యక్షులు శ్రీ కమతం శ్రీనాధ్ యాదవ్ గారి ఆధ్వర్యంలో వెంటనే మద్యం దుకాణం తొలగించాలని డిమాండ్ చెయ్యడం జరిగింది. అనంతరం ఈ విషయం మీద విడవలూరు మండల తహశీల్దార్ గారికి మద్యం దుకాణం తొలగించడానికి చర్యలు తీసుకోవాలని వినతిపత్రాన్ని ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా జనసేనపార్టీ ఉపాధ్యక్షులు బద్ధిపూడి సుధీర్, కోవూరు నియోజకవర్గం జనసేనపార్టీ నాయకులు నరాలశెట్టి మహేష్, విడవలూరు మండలం జనసేనపార్టీ నాయకులు శివ, వరప్రసాద్, శ్రీను, వావిళ్ళ హరికృష్ణ, గోవిందస్వామి మరియు జనసైనికులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way