జనసేన పార్టీలోకి కొత్తపేట నియోజకవర్గం వానపల్లి గ్రామ టీడీపీ ప్రముఖులు భారీగా చేరికలు

                             కొత్తపేట నియోజకవర్గంలో, కొత్తపేట మండలం, వానపల్లి గ్రామానికి చెందిన పలువురు తెలుగుదేశం ప్రముఖులు, జనసేనాని పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు నచ్చి, జనసేన పార్టీ వైపు ఆకర్షితులై, జనసేన పార్టీలోకి జనసేన నాయకులు బండారు శ్రీనివాస్ సమక్షంలో భారీగా చేరారు. కొత్తపేట నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో జనసేన పార్టీ బలోపేతం దిశగా అడుగులు వేస్తున్నదని, జనసేన పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ బండారు శ్రీనివాస్ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ, ప్రజల్లో మార్పు వచ్చిందని రానున్న రోజుల్లో ఇంకా భారీగా చేరికలు ఉంటాయని తెలియజేసారు. అన్ని పార్టీల నుంచి జనసేన పార్టీలోకి వలసలు పెరుగుతాయని, జనసేనపార్టీ సిద్ధాంతాలు నచ్చి మెచ్చి జనసేన వైపు ప్రజలు ఆకర్షితులు అవుతున్నారని అని అన్నారు.  ప్రస్తుత రాజకీయాల్లో అవినీతి లేని, మచ్చలేని నాయకుడు ఒక జనసేనాని పవన్ కళ్యాణ్ మాత్రమేనని అన్నారు. ఈ విషయాన్ని ప్రజలు గ్రహించారని, మన రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే, ఒక్క పవన్ కళ్యాణ్ కు మాత్రమే సాధ్యమని, ఆంధ్ర రాష్ట్రం ప్రస్తుతం అప్పుల రాష్ట్రంగా మారిపోతుందని అన్నారు. జనసేన పార్టీలో చేరిన నాయకులు ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తూ, పలువురు తెలుగుదేశం నాయకులు జనసేన పార్టీ వైపు ఆకర్షితులై బండారు శ్రీనివాస్ సమక్షంలో ఈ రోజు భారీగా చేరరన్నారు. రానున్న రోజుల్లో జనసేన పార్టీ, బీజేపీతో కలిసి తప్పకుండా అధికారం చేపడుతుందని, ఈ రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ నాయకత్వం ఎంతో అవసరమని, అలాగే ప్రధానమంత్రి నరేంద్రమోడీ నాయకత్వం ఈ దేశానికి మరింత అవసరమని అన్నారు. ఈ సందర్భంగా జనసేన పార్టీలోకి చేరిన,వానపల్లి గ్రామ టిడిపి సీనియర్ నాయకులు సిద్దాబత్తుల సత్యనారాయణ, తన అనుచరులతో కలిసి జనసేన పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో సిద్దా బత్తుల మాణిక్యాలరావు, గొల్లపల్లి రామకృష్ణ, బోక్కే సత్యనారాయణ, గొల్లపల్లి ఆనంద్ కుమార్, బళ్ళ వెర్రియ్య, సాదే గణేష్, సాయిబాబు, ఇళ్ల కృష్ణార్జున రావు, బండారు నాగేశ్వరరావు, బండారు సత్తిబాబు, జనసేన పార్టీలోకి చేరినారు. వీరితో పాటు గ్రామ జనసైనికులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way