Search
Close this search box.
Search
Close this search box.

రైతులకు ధాన్యం బకాయిలు తక్షణమే చెల్లించాలని కొఠారు ఆదిశేషు డిమాండ్

కొఠారు ఆదిశేషు

       దెందులూరు ( జనస్వరం ) : దెందులూరు నియోజకవర్గం, కొవ్వలి గ్రామంలో రైతులకు ధాన్యం బకాయిలు తక్షణమే చెల్లించాలని కోరుతూ రైతులు చేపట్టిన రిలే నిరాహార దీక్షకు మద్దతుగా దెందులూరు నియోజకవర్గ జనసేన పార్టీ  నాయకులు కొఠారు ఆదిశేషు సంఘీభావం తెలపడం జరిగింది. ఆయన మాట్లాడుతూ ఒక్క కొవ్వలి గ్రామంలోనే 19 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించవలసి ఉండగా, 8కోట్లు మాత్రమే చెల్లించారు 2 నెలలు దాటినా ఎటువంటి కదలిక లేపోవడంతో రైతన్నలు రిలే దీక్షలు చేపట్టారని అన్నారు. దెందులూరు జనసేన పార్టీ నుండి రైతుల తరుపున పోరాటం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో దెందులూరు నియోజకవర్గ ఐ.టి విభాగ కో ఆర్డినేటర్ ఏనుగు రామకృష్ణ, నియోజకవర్గ నాయకులు రాంకీ, పూజారి సీతారాం, ఇంటూరి కృష్ణ, నేతి రామకృష్ణ పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way