Search
Close this search box.
Search
Close this search box.

కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న గుర్రం కోటేశ్వర రావుకు రూ. 20,000 ఆర్థిక సహాయం అందించిన జనసేన నాయకులు

                 కృష్ణా జిల్లా పెదాయాదర పంచాయతీలో గుర్రం కోటేశ్వర రావు అనే సోదరుడు కిడ్నీ వ్యాధితో బాధపడుతూ తనకు కిడ్నీ పాడైందని స్థానిక జనసేన నాయకుల దృష్టికి తీసుకెళ్లారు.  మచిలీపట్టణం జనసేన ఇంచార్జి బండి రామకృష్ణ గారు, మండల అధ్యక్షులు మరియు పెదాయాదర సర్పంచ్ గల్లా తిమోతి గారు, ముళ్ళపూడి సుబ్బారావు గారు మరియు ఇతర జనసైనికులు, హరిజనవాడ పెద్దలు చెవిరియ్య గారు , సాలి రామకృష్ణ గారు ఇతరులు సోదరులు స్పందించి వారికి రూ. 20,000 ఆర్థిక సాయం అందించడం జరిగింది. కరోనా కష్టకాలంలో పెద్దలు, ఇతర ఫౌండషన్స్ వారు ఈ కుటుంబానికి ఆర్థిక సాయం చేసి తమ దాతృత్వాన్ని చాటుకోవాలని, నిరుపేద కుటుంబానికి అండగా నిలవాలని కోరారు.  ఈ కార్యక్రమాల్లో అడుసుమిల్లి నాంచారయ్య గారు, ముళ్ళపూడి నరేంద్ర గారు, ఖాకీమని రమేష్ గారు తదితరులు పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way