Logo
Date of Publish : 06 December 2025, 10:18 pm
Editor : Sake Naresh

డిసెంబర్ 14 వ తేదీన నూతన రాజకీయ పార్టీని ఆవిష్కరిస్తున్న గౌరవ డాక్టరేట్ అవార్డ్ గ్రహీత కొండిశెట్టి సురేష్ బాబు

నూతన రాజకీయ పార్టీ ఆవిష్కరణ చేస్తున్న ఆర్ ఎం పి కొండిశెట్టి సురేష్

విజయవాడ.డిసెంబర్ 06.( జనస్వరం)

భారతదేశ చరిత్రలో ఒక గ్రామీణ వైద్యుడు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పార్టీ ఆవిష్కరణ కార్యక్రమం 14 వ తేదీ డిసెంబర్ ఆదివారం ఉదయం 9.34 గంటలకు రాజకీయ పార్టీని ఆవిష్కరించటం ఒకే రోజు రెండు తెలుగురాష్ట్రాల్లో పార్టీని ఆవిష్కరించటం నూతన చరిత్ర. ప్రజలతో నిత్యం అందుబాటులో ఉండి ప్రధమచికిత్స చేస్తూ ప్రజలతో కుటుంబ సభ్యుని వలె గ్రామీణ వైద్యుడికి ప్రజల నాడీ తెలుసు. కుటుంబ పరిస్థితులు వారి సాధక బాధలు తెలుసు. పేద మధ్య తరగతి ధనికుల స్థితిగతులు పరిస్థితులు ప్రజల జీవననాడీ జీవనవిధానం వారి ప్రస్తుత ఇబ్బందులు అన్ని విషయాలలో గ్రామీణ వైద్యులకు ఒక అవగాహన ఉంటుంది.స్వాతంత్రం వచ్చినప్పటి నుండి నేటివరకు ఒక గ్రామీణ వైద్యుడు రాజకీయ పార్టీని స్థాపించడం రెండు తెలుగు రాష్ట్రాలలో ఒకేసారి పార్టీని ఆవిష్కరించడం నూతన చరిత్ర.కొందరు చరిత్రలు తిరగ రాయడానికి ఈ భూమి మీదకి వస్తారు. ఒకప్పుడు గుడివాడ నుండి వెండి తెరపై ఒక వెలుగు వెలిగిన మహానుభావులు రాజకీయ పార్టీలు స్థాపించి చరిత్రలు సృష్టించిన మహానుభావులు ఎందరో ఉన్నారు. అదే కోవకు చెందిన కొండిశెట్టి సురేష్ బాబు గుడివాడలో పుట్టి పెరిగి జీవనం కోసం విజయవాడలో ఉంటూ అనేక వ్యవస్థలలో పని చేయుచూ, నేడు నూతన రాజకీయ పార్టీని రెండు తెలుగు రాష్ట్రాల పార్టీ బ్రోచర్ ఆవిష్కరణ చేయుచున్న గౌరవ డాక్టరేట్ అవార్డు గ్రహీత, ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు గ్రహీత, పబ్లిక్ సోషల్ సర్వీస్ హీరో అవార్డు గ్రహీత రాజకీయ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు డా.కొండిశెట్టి సురేష్ బాబు విజయవాడ గాంధీ నగర్ హనుమంతరాయ గ్రంథాలయం నందు ఘనంగా అభిమానుల మధ్య పెద్దల ఆశీస్సులతో నూతన రాజకీయ పార్టీ ఆవిష్కరణ చేయుచున్నారు.స్వాతంత్రం వచ్చిన నాటి నుండి నేటి వరకు ఎన్నిక సమయంలో రాజకీయ పార్టీలు గ్రామీణ వైద్యులకు హామీలు నాయకులు ఇవ్వడం, నాయకులు హామీలు ఇచ్చి అధికారం వచ్చిన తర్వాత కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వకపోవటం, హామీలు నేర వేర్చక పోవటం తరాలుగా జరుగుతుంది.రెండు తెలుగు రాష్ట్రాలనుండి కొండిశెట్టి సురేష్ బాబు అభిమానులు శ్రేయోభిలాషులు,మీడియా మిత్రులు, గ్రామీణ వైద్యులు, ప్రజా నాయకులు, రాజకీయ విశ్లేషకులు, ప్రజలు ఈ కార్యక్రమానికి విచ్చేయుచున్నారని నూతన రాజకీయ పార్టీ వ్యవస్థాపకులు అధ్యక్షులు గౌరవ డాక్టరేట్ అవార్డు గ్రహీత డాక్టర్ కొండి శెట్టి సురేష్ బాబు 9885395466 విజయవాడ తన కార్యాలయం నందు ఒక ప్రకటనలో తెలియజేశారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com