Search
Close this search box.
Search
Close this search box.

జనసేన కార్యకర్తల జోలికివస్తే ఖబడ్దార్ : అనంతపురం జిల్లా అధ్యక్షులు టి.సి.వరుణ్

     పెనుకొండ, (జనస్వరం) : పెనుగొండ నియోజకవర్గంలోని గోరంట్ల పంచాయితీ పరిధిలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములలో పేద ప్రజలకు ఇచ్చినటువంటి ఇళ్ల స్థలాలను వైసీపీ నాయకులు ఆక్రమించుకుంటున్న తరుణంలో దానిని ప్రశ్నించినటువంటి జనసేన నాయకులపై వైసీపీ ప్రభుత్వం జనసేన నాయకులు 5 మంది పైన కేసులు మోపి వైసీపీ నాయకుల వత్తిల్లతో నాయకులను పోలీసులతో చేత వారిని కొట్టించి ఇబ్బంది పెట్టడం జరిగింది. ప్రభుత్వ భూములను కబ్జా చేసినటువంటి వైసీపీ నాయకులు తన పని నిమిత్తం రోడ్డుపైన వస్తున్నటువంటి జిల్లా కార్యదర్శి సురేష్ ఆయన కుమారునిపై వైసీపీ నాయకులు విచక్షణారహితంగా దాడి చేయడం జరిగింది.
ఈ విషయం తెలుసుకున్నటువంటి జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు టీ.సీ.వరుణ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి, రాష్ట్ర కార్యక్రమాల నిర్వహణ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భవాని రవికుమార్, జిల్లా ఉపాధ్యక్షులు అంకె ఈశ్వరయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శిలు పత్తి చంద్రశేఖర్, కుమ్మర నాగేంద్ర, అబ్దుల్ నియోజకవర్గ ఇంచార్జ్ లు ఆకుల ఉమేష్, సాకే పవన్ కుమార్, జిల్లా కార్యదర్శిలు రాపా ధనుంజయ్, అవుకు విజయ్ కుమార్, పెనుగొండ నియోజకవర్గ నాయకులు అందరూ కలిసి దాడిలో గాయపడినటువంటి సురేష్ ని, ఆయన కుమారున్ని, అక్రమ కేసులు బానాయించిన నాయకులని పరామర్శించి వారి కుటుంబాలకి మనోధైర్యం నింపడం జరిగింది. ఎవరైతే దాడి చేశారో వారిపై పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయించి వారిని తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేయడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way