Logo
Date of Publish : 08 August 2022, 1:43 pm
Editor : Sake Naresh

మంత్రి రోజా నోరు అదుపులో పెట్టుకో : అనంతపురం జిల్లా ఉపాధ్యక్షులు జయరామి రెడ్డి

     అనంతపురం, (జనస్వరం) : జనసేన నాయకులు పట్ల అనవసర వ్యాఖ్యలు చేస్తే ప్రతిఘటిస్తామని జిల్లా ఉపాధ్యక్షులు జయరామి రెడ్డి తెలిపారు. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు మీరు అప్పటి ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ఎలా మాట్లాడారో అందరికీ తెలుసని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నేతల విషయంలో మీరు వ్యవహరించిన తీరు ఇంకా ప్రజలకు గుర్తుఉంది. కాంగ్రెస్ పిల్ల పార్టీ అయిన వైసీపీలో చేరిన తర్వాత టిడిపి నేతలను ఇప్పుడు ఎలా తిడుతున్నారో మా అందరికీ తెలుసన్నారు. అధికార మదంతో ఉన్న మీ కంటికి అందరూ పిచ్చి పట్టిన పిల్ల వెధవల్లాగా కనబడడంలో తప్పులేదా! వైసిపి అధికారాన్ని త్వరలోనే అంధకారం చేసే బాధ్యత జనసేన కార్యకర్తలు తీసుకున్నారన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. స్త్రీల అంటే జనసేన నాయకులకు కార్యకర్తలకు ఎంతో గౌరవం. కనీసం ఇప్పటినుంచైనా మంత్రి రోజా మీ నోటిని అదుపులో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది. జనసేన నాయకులను కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడేటప్పుడు అధికార మదంతో నోటికి వచ్చినట్టు హద్దు అదుపు లేకుండా మాట్లాడితే మా జనసేన వీర మహిళలు మీ భరతం పడతారని హెచ్చరిస్తున్నామని తెలిపారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com