కర్నూలు ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్ నోరు అదుపులో పెట్టుకో : జనసేన నాయకులు పవన్ కుమార్

     కర్నూలు, (జనస్వరం) : జనసేనపార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ని విమర్శించే స్థాయి కర్నూలు ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్ కి లేదని, నీ స్థాయి తెలుసుకొని మాట్లాడు అని కర్నూలు జిల్లా జనసేన నాయకులు పవన్ కుమార్ అన్నారు. కర్నూలు నగరంలోని నేడు జనసేన నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా పవన్ కుమార్ మాట్లాడుతూ మీ పైన పోటీ చేయడానికి మా జనసైనికులు చాలని పవన్ కళ్యాణ్ అక్కర్లేదన్నారు. ముందుగా మూడు రాజధానుల పేరుతో కర్నూలు నగరంలో రెండు సార్లు భారీ ర్యాలీలు పాలాభిషేకాలు చేసిన మీరు మూడు రాజధానులలో భాగంగా కర్నూలుకు న్యాయ రాజధాని ఎప్పుడు తీసుకొస్తున్నారో చెప్పాలన్నారు. అలాగే కర్నూలు నగరంలో చిన్నారి ప్రీతి బాయ్ కేసును సీబీఐ కి అప్పజెప్పామని, సిబిఐ నిందితులకు శిక్ష పడే విధంగా లోతుగా విచారణ చేస్తుందని చెప్పి ప్రెస్ మీట్స్ పెట్టి ప్రచారం చేయడం జరిగింది. మరి ఇప్పటి వరకు కూడా ఈ కేసులో నిందితులను ఎందుకు ప్రభుత్వం శిక్షించలేదన్నారు. నిరుద్యోగులకు కనీసం ఉద్యోగ అవకాశాలు కల్పించే లేనటువంటి దీన స్థితిలో వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ఉందని తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way