భవన నిర్మాణ కార్మికులతో సమావేశమైన ఎచ్చెర్ల జనసేన నాయకులు కరిమజ్జి మల్లీశ్వారావు

    ఎచ్చెర్ల, (జనస్వరం) : జనసేనపార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్  పిలుపు మేరకు ఈరోజు ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలం నాలుగు గ్రామాలు భవన నిర్మాణ కార్మికులతో జనసేన నాయకులు కరిమజ్జి మల్లీశ్వారావు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనసేనకు ఈసారి అవకాశం ఇవ్వాలని, అలాగే జనసేనపార్టీ సిద్దాంతాలను పవన్ కళ్యాణ్ గారి ఆదర్శాలను, ఆచరించే విధానాలను ప్రజలకు కరిమజ్జి మల్లీశ్వారావు వివరించడం జరిగింది. అలాగే టిడిపి, వైసీపీ ప్రభుత్వ పాలన చూశారు. ఒక్కసారి అవకాశం ఇచ్చి జనసేన పార్టీ పాలన కూడ ప్రజలు చూడాలని ఆయన కోరారు. రాష్ట్రంలో అన్ని సామాజిక వర్గాల వారికి మేలు చేయాలనే ఆలోచనతో ఉన్నట్టు వంటి పవన్ కళ్యాణ్ గారికి వచ్చే ఎన్నికల్లో జనసేనపార్టీకి ఓటు వేసి పవన్ కళ్యాణ్ గారిని గెలిపించాలని కోరడమైనది. ఈ కార్యక్రమంలో రణస్థలం మండలంలో నాలుగు గ్రామాల కార్మికులు, రాము, పోట్నూరు గౌరి నాయుడు, గణేష్, సత్యం, రాజు, బాలినాయుడు, తవిటినాయుడు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way