గోకవరం, జూలై 24 (జనస్వరం): గోకవరం ప్రభుత్వ ఆసుపత్రికి స్థానిక ఎల్ఐసీ ఏజెంట్లు కరిబండి విష్ణుమూర్తి, కరిబండి నాగేశ్వరరావు రోగుల అవసరాల దృష్ట్యా సీలింగ్ ఫ్యాన్లను బహూకరించారు. ఈ సందర్భంగా సీలింగ్ ఫ్యాన్లను అందజేసిన కరిబండి విష్ణుమూర్తి, కరిబండి నాగేశ్వరరావులను వైద్యులు, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు అభినందించారు. సమాజ సేవా దృక్పథంతో ప్రభుత్వ ఆసుపత్రికి అవసరమైన సామగ్రిని అందించడం అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రామలక్ష్మి, వైద్యులు, నర్సులు, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు రాయవరపు శ్రీనివాసరావు, అల్లాడ అరుణకుమారి, పిటా అరుణ్ తదితరులు పాల్గొన్నారు.