కాకినాడ, (జనస్వరం) : తూర్పుగోదావరి జిల్లా, కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం సిరిపురం, కూరడ, వేళంగి, పెదకొత్తూరు గ్రామాల్లో ఇటీవల ప్రమాదవశాత్తు మరణింంచిన, ప్రమాదాల్లో గాయపడిన, అనారోగ్యంతో ఉన్న జనసైనికుల కుటుంబాలను జనసేన పార్టీ PAC సభ్యులు పంతం నానాజీ పరామర్శించారు. సిరిపురం ఎంపీటీసీ భర్త రాజు ప్రమాదంలో గాయపడగా వారికీ కరప మండల నాయకులు 20,000 వేల రూపాయలను, అదే విధంగా పెదకొత్తూరు గ్రామంలో ప్రమాదంలో మరణింంచిన పళ్ళ నాని కుటుంబానికి స్థానికులు 15000/- రూపాయలు, ఆటో ప్రమాదంలో గాయపడిన పళ్ళ శివకి 5000/- రూపాయలు అందించారు. అలాగే సిరిపురం గ్రామ జనసైనికులు సురేంద్ర తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్న వారిని, వేళంగి గ్రామ జనసైనికులు సింగం ప్రకాశం తల్లి ఆకస్మిక మరణం చెందడం వల్ల వారి కుటుంబ సభ్యులను జనసేన పార్టీ PAC సభ్యులు పంతం నానాజీ కలిసి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.