పెంచిన కరెంటు ఛార్జీలపై కాకినాడ సిటీ జనసేనపార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం

    కాకినాడ సిటీ, (జనస్వరం) : రాష్ట్రంలో పెంచిన కరెంటు చార్జీలు వెంటనే తగ్గించాలని, పవర్ హాలిడే విధించడం వల్ల కార్మికులకు నెలలో కొన్ని రోజులు జీతం రాని పరిస్థితులు ఉంటాయి అని, ఇప్పటికే పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు, పెట్రోలు ధరలు ఇప్పుడు పెరిగిన విద్యుత్ చార్జీలు, పవర్ హాలిడే వల్ల తగ్గుతున్న జీతాలు, ఉద్యోగాలు పోతున్నాయి. ఇలాంటి దిక్కుతోచని పరిస్థితుల్లో కాకినాడ సిటీ 23 వ వార్డులో కాంట్రాక్ట్ కార్మికుల కుటుంబ సభ్యులు చేస్తున్న కోవొత్తుల ర్యాలీకి మద్దతుగా కాకినాడ సిటీ ఇంఛార్జ్ ముత్తా శశిధర్ ఆదేశానుసారం వారికి మద్దతుగా కాకినాడ సిటీ అధ్యక్షులు సంగిశెట్టి అశోక్ ఆధ్వర్యంలో 23 వార్డు దారపు శిరీష సాయంకాలం 6 గంటలకు జగన్నాధపురం మున్సిఫ్ జంక్షన్ దగ్గరనుంచి చిన్న మార్కెట్ రోడ్డు వరకు కొవ్వొత్తులతో నిరసన తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో దారపు శిరీష 23 వ వార్డు వీర మహిళ, సిటీ నాయకులు ఓలేటి రాము, వానపల్లి హరికృష్ణ, సుమంత్, నందు, జనసేన కాకినాడ సిటీ నియోజవర్గ స్థాయి నాయకులు, జనసైనికులు, వీర మహిళలు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way