హన్మకొండ, (జనస్వరం) : వరంగల్ జిల్లా జనసేనపార్టీ కార్యాలయములో మహాత్మా జ్యోతిరావు ఫూలే వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమములో ఉమ్మడి వరంగల్ జిల్లా జనసేన పార్టీ ఇంఛార్జ్ ఆకుల సుమన్ గారు మాట్లాడుతూ అనేక సామాజిక కార్యక్రమలు నిర్వహించిన గొప్ప సంఘ సంస్కర్త జ్యోతిరావు పూలే గారు అని అన్నారు. కులం పేరుతో తరతరాలుగా అణచివేతకు గురి అవుతున్న బడుగు, బలహీనవర్గాల ప్రజలకు పూలే గారు అండగా నిలిచారు అని అన్నారు. అందరికీ చదువు ఎంతో అవసరమని పాఠశాలలను రూపొందించారు. స్త్రీలకు ఆత్మస్థైర్యం కల్పించి, వారి హక్కుల కోసం పోరాడి, సాధికారత కల్పనకు కృషి చేసిన మహనీయుడు అని కొనియాడారు. ఈ సందర్బంగా పూలే జయంతిని, వర్ధంతిని అధికారికంగా ఘనంగా నిర్వహించాలని అలాగే దేశ వ్యాప్తంగా ప్రతి జిల్లాలో జ్యోతిరావు ఫూలే విగ్రహాలను ఏర్పాటు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేసారు.