Search
Close this search box.
Search
Close this search box.

రాజరాజేశ్వరి పేట వాసులకు న్యాయం చేయాలి

● కలెక్టర్ ఢిల్లీ రావు, రెవెన్యూ అధికారులు, రైల్వే అధికారులతో కలిసి పర్యటించిన జనసేనపార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, విజయవాడ నగర అధ్యక్షులు, పశ్చిమ నియోజకవర్గ ఇంచార్జి పోతిన మహేష్
        విజయవాడ, (జనస్వరం) : పాత రాజరాజేశ్వరి పేటలో పర్యటన సందర్భంలో జనసేనపార్టీ విజయవాడ నగర అధ్యక్షులు రాష్ట్ర అధికార ప్రతినిధి, పశ్చిమ నియోజకవర్గ ఇంఛార్జ్ పోతిని వెంకట మహేష్ కలెక్టర్ ని కలిసి ఆర్ఆర్ పేట వాసులకు న్యాయం చేయాలని జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, విజయవాడ నగర అధ్యక్షులు, పశ్చిమ నియోజకవర్గ ఇంచార్జి పోతిన వెంకట మహేష్ కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 40 సంవత్సరాలుగా వారు ఇక్కడే నివాసం ఉంటున్నారని, రైల్వే అధికారులకు ప్రత్యామ్నాయ స్థలము కేటాయించి వీరికి ఇక్కడ శాశ్వత ప్రాతిపదికన ఇళ్లపటాలు కేటాయించి రిజిస్ట్రేషన్ చేయించి ఇవ్వాలని కోరారు. రైల్వే అధికారులు పదే పదే ఈ ప్రాంత వాసులకు నోటీసులు జారీ చేస్తూ తీవ్రమైన ఒత్తిడి చేస్తున్నారని, ఆర్ఆర్ పేట వాసులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా తగు చర్యలు తీసుకోవాలని కోరారు. అందుకు కలెక్టర్ ఢిల్లీరావు, రైల్వే డిఆర్ఎంతో మాట్లాడి సానుకూల నిర్ణయం వచ్చేలాగా ప్రయత్నం చేస్తామన్నారు. మేయర్ స్థానంలో ఉన్న భాగ్యలక్ష్మి ఆర్ఆర్ పేట వాసులతో అవాస్తవాలు మాట్లాడుతున్నారని, రైల్వే అధికారులకు ప్రత్యామ్నాయ స్థలం చూపించడంలో అలసత్వం ప్రదర్శిస్తున్నారని, ముఖ్యమంత్రి జగన్ లిఖితపూర్వకంగా ఆర్ఆర్ పేట వాసులకు ఇచ్చిన హామీని నగరంలో ఉన్న అధికారులు అధికార పార్టీ నాయకులు అమలు చేయడంలో అలసత్వం ప్రదర్శిస్తూన్నారని, ఆర్ఆర్ పేట వాసులకు అన్యాయం చేయాలని చూస్తే జనసేన పార్టీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. ఆర్ఆర్ పేట వాసులకు అన్ని రకాలుగా అండగా నిలబడతామన్నారు. ఈ కార్యక్రమంలో షేక్.షాహీన, కొరగంజి రమణ, పొట్నూరి శ్రీనివాసరావు, బత్తుల వెంకటేష్, బావిశెట్టి శ్రీనివాస్, జగదీష్, పవన్ కళ్యాణ్, వెంకటేష్, నూకరాజు, మహేష్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way