Search
Close this search box.
Search
Close this search box.

దివ్యాంగులకు న్యాయం చేయాలి… నిరహారదీక్షకు జనసేన సంఘీభావం

                    అన్ని సక్రమంగా ఉన్న వారికి ఎన్నో సంక్షేమ పథకాలను అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం  వికలాంగులు విషయంలోనూ ఉదారంగా స్పందించి ఆదుకోవాలని జనసేన అధికార ప్రతినిధి శెట్టి రవి డిమాండ్ చేశారు. ఉండటానికి గూడు లేక ఎంతో కాలంగా నిరాశ్రయులుగా కాలం వెళ్లదీస్తున్న దివ్యాంగులు తమకు ప్రభుత్వం నివాస యోగ్యం కల్పించాలని రిలే నిరాహారదీక్షలు చేపట్టారు. మండపేట తహశీల్దార్ కార్యాలయం వద్ద వికలాంగులు చేపట్టిన దీక్షా శిబిరాన్ని వారు సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దివ్యాంగుల పట్ల ప్రభుత్వం చిన్నచూపు చూడటం తగదన్నారు. వికలాంగుల విషయంలో నిబంధనలు పక్కన పెట్టి ప్రతి ఒక్కరూ మానవత్వం తో స్పందించాలని కోరారు. ఇళ్లు లేక నిరాధారంతో బతుకుతున్న దివ్యాంగులను ప్రభుత్వం ఇళ్లు ఇచ్చి ఆదుకోవాలన్నారు. అదేవిధంగా వారికి ప్రభుత్వం తరపున రావల్సిన సంక్షేమ ఫలాలు అన్నీ అందించి అండగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పైడమళ్ళ సతీష్, మోటుపల్లి జానీ, నిమ్మ రమేష్, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way