Search
Close this search box.
Search
Close this search box.

ధర్మవరం జనసేనపార్టీలోకి చేరికలు

    ధర్మవరం ( జనస్వరం ) : జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు నచ్చి వైసీపీ పార్టీ నుండి జనసేన పార్టీ లోకి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి సమక్షంలో ధర్మవరం నియోజకవర్గం, ధర్మవరం మండలం పోతులనాగేపల్లి గ్రామానికి చెందిన 10 మంది కుటుంబాలు చేరడం జరిగింది. చేరిన వారి పేర్లు కుల్లం పల్లి రమేష్,మురేప్ప గారి శంకర్, కలవగడ్డ నరసింహులు,పెద్ది నాయుడు, కృష్ణం నాయుడు, రామాంజనేయులు మరియు మొదలగున వారు ఉన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ పార్టీలోకి చేరిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియచేసుకుంటూ కార్యకర్తల కోసం నిరంతరం అందుబాటులో ఉంటూ ఏ ఆపద వచ్చిన ముందు ఉంటానని హామీ ఇచ్చారు. అలాగే ప్రతి కార్యకర్త సైనికుడిలాగా పనిచేసి జనసేన పార్టీని గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు నిర్మిద్దామని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మత్స్యకార వికాస విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెస్త శ్రీనివాసులు, కార్యనిర్వాహణ కమిటీ సభ్యులు ప్యాదింది వెంకటేష్, కోటికి రామాంజి, బండ్ల చంద్రశేఖర్ మరియు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way