Search
Close this search box.
Search
Close this search box.

కళ్యాణదుర్గం మండల అధ్యక్షుడు షేక్ మొహిద్దీన్ ఆధ్వర్యంలో జనసేన పార్టీలోకి చేరికలు

కళ్యాణదుర్గం

        అనంతపురం ( జనస్వరం ) : కళ్యాణదుర్గం పట్టణంలో జనసేన పార్టీ సిద్ధాంతాలు నచ్చిన గూబనపల్లి గ్రామం యువకులను కళ్యాణదుర్గం మండల అధ్యక్షుడు షేక్ మొహిద్దీన్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. షేక్ మొహిద్దీన్ మాట్లాడుతూ రాజకీయం డబ్బుతో ముడిపడిన వ్యవస్థ అని రాజకీయలవైపు కన్నెత్తి చూడలంటేనే భయపడేవారిని సైతం ఎంతో మంది యువకులకు ఆవకాశం కల్పించిన పార్టీ జనసేన అని అన్నారు. గ్రామాలు అభివృద్ధి చెందాలంటే యువతలో ప్రశ్నించేతత్వం రావాలని అప్పుడే అవినీతి జరగకుండా పారదర్శకంగా అభివృద్ది పనులు సక్రమంగా జరుగుతాయని తెలిపారు. నేటి వ్యవస్థ మార్పుకోసం జరుగుతున్న ఉద్యమాల్లో యువతరమే సింహాభాగంగా సాగుతుందని భావి భారత నిర్మాణం యువత చేతుల్లోనే ఉందని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి లక్ష్మీనరసయ్య, సంయుక్త కార్యదర్శి బాల్యం రాజేష్ తదితర జనసైనికులు పాల్గొనడం జరిగింది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way