Search
Close this search box.
Search
Close this search box.

టిడిపి, వైసీపీ పార్టీ నుంచి జనసేనలోకి చేరికలు

జనసేన

     పాయకరావుపేట : (జనస్వరం) నక్కపల్లి మండలం వేంపాడు గ్రామానికి చెందిన వైసీపీ మరియు టీడీపీ పార్టీకి చెందిన సుమారు 50 మంది దళితులు జనసేన పార్టీకి ఆకర్షితులై జనసేన పార్టీ సీనియర్ నాయకులు గెడ్డం బుజ్జి ఆధ్వర్యంలో పార్టీలోకి చేరారు. వీరికి బుజ్జి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం బుజ్జి మాట్లాడుతూ పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై పార్టీలో చేరినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే పార్టీ నుంచి మరియు నా నుంచి మీకు ఏ విధమైన సహాయం కావలసి వచ్చిన నిరంతరం అందుబాటులో ఉంటానని జనసైనికులకు వారికి భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మిరియాల అప్పారావు, తాతపూడి రాంబాబు, కాండ్రకోట నూకరాజు, నాగన్న, లోవరాజు, యేసు, రమణ,జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way