శ్రీకాళహస్తి జనసేన పార్టీలో చేరికలు

శ్రీకాళహస్తి

       శ్రీకాళహస్తి ( జనస్వరం ) : పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు నచ్చి శ్రీకాళహస్తి పట్టణం 9 వ వార్డు, పి.వి. స్ట్రీట్ నుండి తోటకారి అరుణ్ గారి నేతృత్వంలో 50 మంది యువకులు, మహిళలు జనసేన పార్టీలో చేరారు. పట్టణ ఉపాధ్యక్షులు తోట గణేష్, ప్రధాన కార్యదర్శి పేట చిరంజీవి, పేట చంద్ర శేఖర్ ఆధ్వర్యంలో నియోజకవర్గ ఇన్చార్జి వినుత కోటా స్థానిక పార్టీ కార్యాలయంలో వారికి జనసేన కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వినుత గారు మాట్లాడుతూ పెద్ద ఎత్తున శ్రీకాళహస్తి పట్టణం నుండి జనసేన పార్టీకి మద్దతుగా వచ్చిందుకు వారిని అభినందిస్తూ, పార్టీ గెలుపుకు కృషి చెయ్యాలని, కష్ట పడ్డ ప్రతి ఒక్కరికీ పార్టీలో తగిన స్థానం కల్పిస్తామని అన్నారు. పార్టీ అధికారంలోకి వస్తే స్థానిక ప్రజల సమస్యలు పూర్తి స్థాయిలో పరిష్కరిస్తామని ప్రజలకి మీద్వారా భరోసా ఇవ్వాలని తెలిపారు. కొత్తగా చేరిన వారిలో సారిక, లక్ష్మి, లావణ్య, జయంత్, గణేష్, మనోజ్, తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి మండల అధ్యక్షులు దండి రాఘవయ్య, నియోజకవర్గ ఐటీ కోఆర్డినేటర్ కావలి శివ కుమార్, తొట్టంబేడు మండల ప్రధాన కార్యదర్శి పేట చంద్ర శేఖర్, నాయకులు గురవయ్య, ఉదయ్ కుమార్, దినేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way