Search
Close this search box.
Search
Close this search box.

పిచ్చివాన్ని పిచ్చోడు అంటే తప్పేంటి జోగి రమేష్ : అంకె ఈశ్వరయ్య

       అనంతపురం ( జనస్వరం ) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వ్యవహారం చూస్తుంటే పిచ్చి పట్టిన వాడిలా ఉంది ఈ విషయాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావిస్తే అందులో తప్పేముంది జోగి రమేష్ ను ఉద్దేశించి మాట్లాడారు. ఆదివారం ఈశ్వరయ్య విలేకరులతో మాట్లాడుతూనువ్వు అసలు ఏ శాఖకు మంత్రివో నీకు తెలుసా, ఆ శాఖకు సంబంధించి ఏ రోజైనా ప్రెస్ మీట్ పెట్టావా అని జనసేన అనంతపురం జిల్లా ఉపాధ్యక్షులు అంకె ఈశ్వరయ్య ఘాటుగా స్పందించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ జనసేన కలయికతో రాబోవు ఎన్నికలలో ముందుకెళ్తున్నాం అని ప్రస్తావించిన వెంటనే వైసీపీ నాయకులలో వెన్నులో వెనుక పుట్టి మంత్రులందరూ రోడ్డుపైకి వచ్చి పిచ్చి కుక్కల మాదిరి మొరుగుతున్నారని పేర్కొన్నారు.
అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు ఏ శాఖకు సంబంధించిన మంత్రులు ఆ శాఖ గురించి తప్ప మిగతా విషయాలు మాట్లాడతా ఉన్నారని ఆంధ్రప్రదేశ్ లోని ప్రజల పరిస్థితి పిచ్చోడు చేతిలో రాయి మాదిరి ఉందన్నారు.  జగన్మోహన్ రెడ్డి ఏ క్షణాన ఏ నిర్ణయం తీసుకుంటాడో అని రాష్ట్ర ప్రజలు భయపడుతున్నారు.దీన్ని బట్టి చూస్తే రాష్ట్రంలో ఎవరు పిచ్చోళ్లో మీకు అర్థమవుతుందా జోగి రమేష్ ను ఉద్దేశించి అన్నారు. రాష్ట్ర ప్రజలను కాపాడుకోవాలంటే పిచ్చోల్ని ఇంటికి తరిమేయాలి. లేదంటే రాష్ట్ర ప్రజలే బట్టలూడదీసి కొడతారు.రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన వ్యవహారశీలి మానసిక స్థితి గమనిస్తూ ఉంటే ఒక సైకో మాదిరి ఒక పిచ్చోని మాదిరి ప్రవర్తిస్తున్నారని ప్రజలే చెప్తున్నారు. ఆరు నెలల తరువాత జగన్మోహన్ రెడ్డిని ప్రజలు పిచ్చాసుపత్రికి పంపించడానికి సిద్ధంగా ఉన్నారని మండిపడడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way