జీవో నెంబర్ 50ను తక్షణమే రద్దు చేయాలి : అరకు జనసేనపార్టీ పార్లమెంట్ అధికార ప్రతినిధి మాదాల శ్రీరాములు

అరకు

   అరకు వేలి, (జనస్వరం) : ఏపీలో ఎయిడెడ్ విద్యా సంస్థలపై ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టం విద్యార్థుల పాలిట శాపంగా మారిందని దశాబ్దాల తరబడి విద్యనందించిన ఎన్నో ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు మూతపడుతున్నాయని జనసేనపార్టీ అరకు పార్లమెంట్ అధికార ప్రతినిధి మాదాల శ్రీరాములు గారు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. విశాఖలోని సిక్రెడ్ హార్ట్ స్కూల్, ప్రకాశం జిల్లాలోని సీఎస్ఆర్ శర్మ కళాశాల, నెల్లూరుకు తలమానికంగా పేరున్న వీఆర్ హైస్కూల్‌తోపాటు ఎయిడెడ్ విద్యాలయాల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందని ఎయిడెడ్ విద్యా సంస్థలపై ప్రభుత్వం తెచ్చిన జీవోకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు చేస్తున్న ఆందోళనలపై అన్యాయంగా పోలీసుల అత్యుత్సాహంతో లాఠీఛార్జిలు చేసి మహిళలపై దాడిలు చేయడం దుర్మార్గమని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆరోపించారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఎయిడెడ్ విద్యా సంస్థల నూతన విధానాన్ని జీవో నెంబర్ 50ని రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way