జీవో నెంబర్ 1 ని తక్షణమే రద్దు చేయాలి : వీరఘట్టం జనసేన నాయకులు

      వీరఘట్టం, (జనస్వరం) : శ్రీకాకుళం జిల్లా, పాలకొండ నియోజకవర్గం, వీరఘట్టం మండలం, నడుకూరు గ్రామంలో జనసేన నాయకులు ఆధ్వర్యంలో ప్రవాస భారతీయులు దినోత్సవంని పురస్కరించుకుని మహాత్మా గాంధీ విగ్రహానికి పూల మాలలువేసి నివాలు అర్పించారు. ఈ సందర్భంగా వారు ఆంధ్రప్రదేశ్ లో వైస్సార్సీపీ ప్రభుత్వం జి.ఓ 1 ని తక్షణమే రద్దు చేయాలి జనసేన పార్టీ నాయకులు నోటికి రూమర్లు కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. అనంతరం మత్స పుండరీకం మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సీఎం జగన్ నూతన సంవత్సర సంక్రాంతి కానుకగా జి.ఓ 1ఇచ్చారని, నిర్బంధ, చీకటి జీఓ తో రహదారులు, వీధుల్లో, సమావేశాలు, ర్యాలీలు చేయకుండా నిర్బంధాన్ని తీసుకురావడం హక్కులకోసం పోరాడే వ్యక్తులకు, ప్రశ్నoనిచే వ్యక్తులకు, ప్రజాస్వామిక శక్తులకు గొంతు నొక్కడమేనని దీనిని తక్షణమే రద్దు చేయాలని, జీఓ1 రద్దు అయ్యేవరకు అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు పోరాడాలని పుండరీకం పిలుపునిచ్చారు. పౌరహక్కులపై నిర్బంధం తీసుకురావడం సరైన చర్య కాదన్నారు. హక్కులను కాలరాసే జీఓ 1ని తక్షణమే రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way