జనసేనపార్టీ విజయవాడ పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో ఘనంగా ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి వేడుకలు

       విజయవాడ, (జనస్వరం) : ఆంగ్లేయుల ఆధిపత్యాన్ని, దురాక్రమణను ధిక్కరించిన సామ్రాజ్ఞి, ఆశయ సాధనకు ఆయుధాన్ని చేపట్టి అలుపెరుగక పోరాడిన ధీశాలి, అనుబంధాలు నెలవైన మాతృమూర్తి ఝాన్సీ రాజ్య సారధి రాణీ లక్ష్మీ బాయి 194వ జయంతి వేడుకలను జనసేనపార్టీ విజయవాడ పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో వీర మహిళలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వీర మహిళలు మాట్లాడుతూ ఝాన్సీ లక్ష్మీబాయి మహిళలందరికీ ఆదర్శమని ఆమె స్ఫూర్తిని నింపుకొని ముందుకు సాగాలని, ఝాన్సీ లక్ష్మీబాయిని ఆదర్శంగా తీసుకొని ప్రతి మహిళ అన్యాయాన్ని ఎదిరించాలని, వైసీపీ ప్రభుత్వంలో మహిళలపై దాడులు పెరిగాయని, మహిళలకు రక్షణ కరువైందని ప్రభుత్వంలో మహిళలు అన్యాయాన్ని ప్రశ్నిస్తే వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేస్తున్నారని, మహిళా సాధికారత పవన్ కళ్యాణ్ వల్లే సాధ్యమవుతుందని, జనసేనపార్టీ వీర మహిళలకు పెద్దపీట వేస్తుందని, రాబోయే రోజుల్లో ఒక్కొక్క మహిళ ఒక లక్ష్మీ ఝాన్సీ బాయ్ అయ్యి వైసీపీకి తగిన రీతిలో బుద్ధి చెప్పి ఇంట్లో కూర్చో పెడతారన్నారు. ఈ కార్యక్రమంలో ఆలమూరు శ్రీదేవి, నగర ప్రధాన కార్యదర్శి ముబీనా, సంయుక్త కార్యదర్శి విజయ్ కుమారి, పాల రజిని, అమ్మవారి ధార్మిక సేవ మండలి కమిటీ సభ్యులు రేవడి రమాదేవి, సుజాత, శిరీష, అక్తార్ ఉన్నిసా తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way