Search
Close this search box.
Search
Close this search box.

భారతదేశ సైనికుడు అలీముల్లా పైన జరిగిన సంఘటనను తీవ్రంగా ఖండించిన జనసేన నాయకులు జయరాం రెడ్డి

     అనంతపురం, (జనస్వరం) : జమ్ము కాశ్మీర్ లో సైనికుడిగా పని చేసే శ్రీ అలీముల్లా గారి ఎడల.. పరవాడలో పోలీసులు అవమానకరంగా ప్రవర్తించిన తీరు చాలా బాధాకరం. దేశాన్ని కాపాడే సైనికుడికి కూడా వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో రక్షణ లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇక సామాన్యుల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఈ సంఘటన ద్వారా అర్థమవుతుంది. రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ పూర్తిగా విచ్ఛిన్నమైంది. రాష్ట్ర ప్రజల హక్కులను, స్వేచ్ఛను వైసిపి ప్రభుత్వం పూర్తిగా హరించి వేస్తాఉంది.సాక్షాత్తు భారతదేశ సైనికుడి పై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. కొంతమంది పోలీసులు, అధికారుల ద్వారా ప్రజలను వేధిస్తూ దిశా యాప్ ను బలవంతంగా ఫోన్లో డౌన్లోడ్ చేయించడం భావ్యం కాదు, మరోవైపు దిశా యాప్ గురించి జగన్మోహన్ రెడ్డి గారు గొప్పలు చెప్పుకుంటున్నారు. కొంతమంది అధికారులు, పోలీసులు అత్యుత్సాహంతో ప్రభుత్వ పెద్దల మెప్పు పొందాలని దురుద్దేశంతో ప్రవర్తిస్తూ వారి వారి డిపార్ట్మెంట్లకు చెడ్డ పేరు తెస్తున్నారు. భారతదేశ సైనికుడు అలీముల్లా గారి పైన జరిగిన సంఘటనను పూర్తి విచారణ జరిపించి, సంఘటనకు కారకులైన వారి అందరి పైన తగిన చర్యలు తీసుకొని కఠినంగా శిక్షించాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఇటువంటి సంఘటనలు మరలా పునరావతం కాకుండా లా అండ్ ఆర్డర్ ని బలోపేతం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. కేవలం కంటి తుడుపు చర్యగా మమ అనిపిస్తే రాష్ట్ర ప్రజలు చూస్తూ ఊరుకోరు వచ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెబుతారని హెచ్చరిస్తున్నామని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way